బాల రాముడి దివ్యమైన కనులను చెక్కింది వీటితోనే.. అరుణ్ యోగిరాజ్ పోస్ట్ వైరల్
అయోధ్య రామమందిరంలో పూజలు అందుకుంటున్న బాల రాముడి విగ్రహాన్ని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించారు. చిరునవ్వుతో కనిపిస్తున్న విగ్రహాన్ని సుందరంగా తీర్చిదిద్దిన ఆయన కళా నైపుణ్యాన్ని రామ భక్తులు అందరూ మెచ్చుకుంటున్నారు. నెటిజన్లు అయితే ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆయన రూపొందించిన విగ్రహానికి కోట్లాది మంది భక్తులు పూజలు చేస్తున్నారని, ఇంతటి అదృష్టం ఎవరికి దక్కుతుందని అంటున్నారు.
అయోధ్య రామమందిరంలో పూజలు అందుకుంటున్న బాల రాముడి విగ్రహాన్ని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించారు. చిరునవ్వుతో కనిపిస్తున్న విగ్రహాన్ని సుందరంగా తీర్చిదిద్దిన ఆయన కళా నైపుణ్యాన్ని రామ భక్తులు అందరూ మెచ్చుకుంటున్నారు. నెటిజన్లు అయితే ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆయన రూపొందించిన విగ్రహానికి కోట్లాది మంది భక్తులు పూజలు చేస్తున్నారని, ఇంతటి అదృష్టం ఎవరికి దక్కుతుందని అంటున్నారు. అరుణ్ యోగిరాజ్ కుటుంబం కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. తన కొడుకు రూపుదిద్దిన బాల రాముడి విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్ఠించడం తమ కుటుంబానికి దక్కిన అదృష్టమని అరుణ్ తల్లి పేర్కొన్నారు. తాజాగా బాల రాముడి విగ్రహానికి సంబంధించి ఓ కీలక విషయాన్ని అరుణ్ యోగిరాజ్ వెల్లడించారు. బాల రాముడి దివ్య నేత్రాలను చెక్కిన పనిముట్లను సోషల్ మీడియాలో పంచుకున్నారు. వెండి సుత్తి, బంగారు ఉలిని చేతిలో పట్టుకుని చూపిస్తూ.. వీటితోనే బాల రాముడి విగ్రహానికి దివ్య నేత్రాలను తీర్చిదిద్దానని తెలిపారు. ఈ ఫొటోను అరుణ్ యోగిరాజ్ ఇన్ స్టాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP9 ET: మహేష్ సినిమా అంటే చులకనా.. ఫ్యాన్స్ సీరియస్ | ఒక్కొక్కరికీ ఇచ్చిపడేసిన డైరెక్టర్
మైనర్ ప్రియుడితో ఎఫైర్..! అత్త గొంతు కోయించిన కిల్లర్ కోడలు
మద్యం మత్తులో మాస్ ఫైట్! బార్ బయట వీరంగం
అధికారం ఉందని అతి చేయకూడదు.. వన్ బై త్రీ కాఫీ ఇవ్వలేదని
ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురికి పిండం పెట్టిన తల్లిదండ్రులు
చదివింది లా.. గురుడు చేసే పని తెలిస్తే షాకే
శ్మశానం నుంచి బిర్యానీ ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడంటే..
ఇసుక మేటల నుంచి పూర్తిగా బయటకు వచ్చిన శివాలయం.. అద్భుతంగా ఉంది

