Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో ఇక ఈ బ్యాంక్ కనిపించదు..

తెలంగాణలో ఇక ఈ బ్యాంక్ కనిపించదు..

Phani CH

|

Updated on: Dec 23, 2024 | 7:29 PM

కేంద్ర ప్రభుత్వం గ్రామీణ బ్యాంకుల విలీన ప్రక్రియ షురూ చేసింది. ఇందులో భాగంగానే.. ఒక రాష్ట్రంలో ఒకే గ్రామీణ బ్యాంకు ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. గ్రామీణ బ్యాంకుల్నే రీజనల్ రూరల్ బ్యాంక్స్ RRB అంటారు. ఒకే రాష్ట్రం.. ఒకే గ్రామీణ బ్యాంక్ నినాదంతో దీనిని తీసుకొచ్చింది. ఈ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల నిర్వహణలో సమర్థత పెంచుతూ.. ఖర్చుల్ని తగ్గించేందుకే కేంద్ర ప్రభుత్వం.. ఈ బ్యాంకుల విలీన ప్రక్రియను మరింత వేగవంతం చేస్తోంది.

ఇదివరకే 3 దశలుగా ఈ విలీన ప్రక్రియ జరగ్గా.. ఇప్పుడు నాలుగో విడత మొదలుపెట్టింది. 2025, జనవరి 1 నుంచే ఈ కొత్త వ్యవస్థ అమల్లోకి రానుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా మొత్తం 5 గ్రామీణ బ్యాంకులు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇవి కూడా విలీనం కానున్నాయి. పెద్ద బ్యాంకులో విలీనం అవుతాయని చెప్పొచ్చు. తాజాగా ఈ విలీనానికి సంబంధించి.. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు కీలక ప్రకటన చేసింది. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ సహా.. తన ట్విట్టర్ హ్యాండిల్లోనూ ఇంపార్టెంట్ పబ్లిక్ నోటీస్, ముఖ్య గమనిక అంటూ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు .. రెండు తెలుగు రాష్ట్రాల్లో సేవలు అందిస్తుండగా.. ఇక కేవలం ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కానుంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రైమ్‌ యూజర్లకు షాకిచ్చిన అమెజాన్‌.. కొత్త ఏడాది నుంచి ఈ నిబంధన అమల్లోకి

చలికాలంలో ఇలా చేస్తే చక్కని ఆరోగ్యం మీ సొంతం !!

క్యూట్ లుక్స్ కుర్రకారుని ఇట్టే పడేస్తున్న మాడ్ బ్యూటీ శ్రీ గౌరి..

నాగుపాము తలపై నిజంగానే మణి ఉంటుందా.. నిజమెంత ??

క్యూట్ లుక్స్ కుర్రకారుని ఇట్టే పడేస్తున్న మాడ్ బ్యూటీ శ్రీ గౌరి..