CM Chandrababu New House: కొత్త ఇంటి నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన.. ఎక్కడో తెలుసా?
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర రాజధాని అమరావతిలో మరో ఇంటిని నిర్మించబోతున్నారు. అమరావతిలోని వెలగపూడి సచివాలయం వెనక E9 రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టారు. ఈ సందర్భంగా తన ఇంటి నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కుటుంబ సమేతంగా కొత్త ఇంటి శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర రాజధాని అమరావతిలో కొత్త ఇంటిని నిర్మించబోతున్నారు. అమరావతిలోని వెలగపూడి సచివాలయం వెనక E9 రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టారు. ఈ సందర్భంగా తన ఇంటి నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కుటుంబ సమేతంగా కొత్త ఇంటి శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ ఇంటి నిర్మాణం కోసం గత ఏడాది డిసెంబరులో ఇదే గ్రామానికి చెందిన ఓ రైతు నుంచి 5 ఎకరాల స్థలాన్ని సీఎం చంద్రబాబు కొనుగోలు చేశారు. ఇటీవలే ప్లాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో 1,455 చదరపు గజాల విస్తీర్ణంలో జి ప్లస్ 1 ఇంటి నిర్మాణానికి ఇవాళ శంకుస్థాపన చేశారు. ఏడాదిలోపు ఇంటి నిర్మాణ పూర్తి చేసి గృహప్రవేశం చేయాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్, బ్రాహ్మణి, దేవాంశ్ పాల్గొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..
లెక్కల టీచర్ సొంత ఖర్చుతో.. విమానమెక్కిన విద్యార్థులు

