AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రైల్వే‌స్టేషన్‌లో కంగారుగా కనిపించిన నలుగురు వ్యక్తులు.. బ్యాగులు చెక్ చేయగా

Telangana: రైల్వే‌స్టేషన్‌లో కంగారుగా కనిపించిన నలుగురు వ్యక్తులు.. బ్యాగులు చెక్ చేయగా

Ravi Kiran
|

Updated on: Jul 31, 2024 | 6:09 PM

Share

మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన నలుగురు వ్యక్తులను విచారించగా.. పోలీసులకు అసలు విషయం బయటపడింది. ఇంతకీ ఆ సంగతి ఏంటి.? ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో నలుగురు గంజాయి స్మగ్లర్లను పోలీసుల అరెస్టు చేశారు. మంచిర్యాల ఏసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డీసీపీ భాస్కర్ వివరాలను వెల్లడించారు. మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన నలుగురు వ్యక్తులను విచారించగా 1100 గ్రాముల గంజాయి లభించిందని డీసీపీ తెలిపారు. మహారాష్ట్రలోని బల్లర్ష, నాగపూర్, చంద్రపూర్ ప్రాంతాల నుంచి గంజాయి దిగుమతి చేస్తున్నారని చెప్పారు. మంచిర్యాలకు చెందిన భూక్యా సారయ్య, అల్మేకర్ శ్యామ్, వెంకటేష్ చెడు అలవాట్లు, జల్సాలకు అలవాటుపడి డబ్బులు సరిపోకపోవడంతో మహారాష్ట్ర బల్లార్షలో పాన్ షాప్ నడుపుతున్న ఎస్.కె రిజ్వాన్ వద్ద కిలోకు 16 వేల రూపాయలకు గంజాయి కొనుగోలు చేశారు.

ఇది చదవండి: ఛీ.. ఛీ.! ఇదేం పని.. కారులో నలుగురు పిల్లల ముందు శృంగారం.. ఆ తర్వాత సీన్ ఇది

దాన్ని మంచిర్యాల ప్రాంతంలో యువకులకు 20 గ్రాములకు 200 రూపాయల చొప్పున గంజాయి విక్రయిస్తున్నారని డీసీపీ వివరించారు. గోదావరిఖనికి చెందిన ప్రేమ్ అనే వ్యక్తికి రైల్వే స్టేషన్‌లో గంజాయి అమ్ముతుండగా నలుగురు వ్యక్తులు పట్టుపడ్డారని తెలిపారు. వీరి వద్ద నుంచి 1100 గ్రాముల గంజాయి, 4000 రూపాయలు, నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు పంపించినట్లు డీసీపీ తెలిపారు. గంజాయిని అరికట్టేందుకు నార్కోటిక్ డ్రగ్ టెస్టింగ్ కిట్లను ప్రతి పోలీస్ స్టేషన్‌లో అందుబాటులో ఉంచామన్నారు. గంజాయి రహిత మంచిర్యాల జిల్లాగా కృషి చేసేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని డీసీపీ భాస్కర్ వెల్లడించారు.

ఇది చదవండి: రండి బాబూ రండి.! ఓన్లీ ఫర్ సింగిల్స్.. హాగ్‌కు రూ. 11, ముద్దుకు రూ. 110.. ఎక్కడంటారా

Published on: Jul 31, 2024 06:00 PM