AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శివోహం.. ఒక కల అతని జీవితాన్నే మార్చేసింది.. వందల కోట్ల వ్యాపారాన్ని విడిచి శివ భక్తుడిగా మారిన జపాన్ బిజినెస్ మ్యాన్..

శ్రావణ మాసంలోని పవిత్ర రోజూ పవిత్రమైన రోజే. అంతేకాదు సోమవారం శివ పూజకు, మంగళవారం మంగళ గౌరీ నోముకి, శుక్రవారం వరలక్ష్మి వ్రతానికి శనివారం వేంకటేశ్వర స్వామిని పూజించడం అత్యంత ఫలవంతం అని నమ్మకం. అయితే ఉత్తరాదివారు శ్రావణ మాసంలో కావిడి యాత్ర (కన్వరి యాత్ర) ని చేస్తారు. గంగాజలాన్ని తీసుకుని వచ్చి శివుడికి అభిషేకం చేయడం వలన శివుడు ప్రసన్నం అవుతాడని కోరిన కోర్కెలు తీరుస్తాడని నమ్మకం. అందుకనే శ్రావణ మాసం వస్తే ఉత్తరాది ప్రాంతలో కన్వారిలు కావిడి యాత్ర చేస్తూ కనిపిస్తారు. అయితే ఇప్పుడు ఒక జపాన్ కి చెందిన వ్యక్తికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

శివోహం.. ఒక కల అతని జీవితాన్నే మార్చేసింది.. వందల కోట్ల వ్యాపారాన్ని విడిచి శివ భక్తుడిగా మారిన జపాన్ బిజినెస్ మ్యాన్..
Japanese Businessman
Surya Kala
|

Updated on: Jul 30, 2025 | 1:47 PM

Share

శ్రావణ మాసంలో శివ భక్తులు కావడి యాత్ర చేపట్టి.. గంగా జలంతో శివుడికి అభిషేకం చేస్తారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక జపాన్ కి చెందిన వ్యక్తికీ సంబంధించిన ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. అతను కాషాయ వస్త్రాలు ధరించి ఉన్నాడు. పేరు హోషి తకయుకి. జపాన్ లో ప్రముఖ బిజినెస్. కోటీశ్వరుడు. ఇప్పుడు హోషి తకయుకి తన వందల కోట్ల వ్యాపారాన్ని విడిచి పెట్టి.. శివుడికి అంకితం అయ్యాడు. శివ భక్తిలో మునిగితేలుతున్నాడు. అంతేకాదు హోషి తకయుకి ఇప్పుడు బాల కుంభ గురుముని పేరుతో పిలబడుతున్నాడు.

జపాన్ లోని విలాసవంతమైన జీవితాన్ని విడిచి పెట్టి మన దేశానికి వచ్చాడు. ఉత్తరాఖండ్‌లో ప్రస్తుతం నివసిస్తున్నారు. కాషాయ వస్త్రాలను ధరించి బాల కుంభ గురుముని ప్రస్తుతం ఆత్మ గురించి తెలుసుకునేందుకు సాధనలో ఉన్నారు. శ్రావణ మాసం సందర్భంగా కన్వర్ యాత్ర చేపట్టారు. చెప్పులు లేకుండా పవిత్ర గంగాజలాన్ని తీసుకుని వచ్చి శివుడికి అభిషేకాన్ని చేశారు. ఈ యాత్ర చేసే సమయంలో ఆయనతో పాటు సుమారు 20 మంది జపనీస్ అనుచరులు కూడా ఉన్నారు.

ఇవి కూడా చదవండి

హోషి తకయుకి ఎందుకు భారత దేశంలో స్థిర పడ్డారంటే..

హోషి తకయుకి సుమారు 20 సంవత్సరాల క్రితం తమిళనాడుకు వచ్చారు. అప్పుడు ప్రాచీన సిద్ద సంప్రాదయం అయిన నాడీ జ్యోతిష్యం గురించి ఆయనకు తెలిసింది. వేల సంవత్సరాల క్రితం రాసిన తాళపత్ర ద్వారా వ్యక్తికి సంబంధించిన గతం, భవిష్యత్ ని తెలుసుకుంటారు. ఈ విషయం తెలిసిన వెంటనే హోషి తకయుకి తన గురించి తెలుసుకోవాలని భావించాడు. అప్పుడు ఆతాళపత్ర గ్రంథాల ద్వారా హోషి తకయుకి పూర్వ జన్మ భారత దేశంలోనే జరిగిందని తెలుసుకున్నాడు. అంతేకాదు అప్పుడు ఉత్తరాఖండ్‌లోని హిమాలయాలలో సానువుల్లో గడిపినట్లు.. ఆ తాళపత్ర గ్రంథాల్లో పేర్కొంది. హిందూ ఆధ్యాత్మికతను స్వీకరించడం అతని విధి అని పేర్కొంది.

తన దేశానికి వెళ్ళిన తర్వాత అతనికి కొంతకాలం తర్వాత ఒక కల వచ్చింది. ఆ కలలో తాను ఉత్తరాఖండ్‌లోని ఒక గ్రామంలో ఉన్నట్లు కనిపించింది. వెంటనే అతను భారత దేశం రావాలని నిర్ణయం తీసుకున్నాడు. అప్పటి నుంచి అతడు జీవించే విధానం మారిపోయింది.

తన వ్యాపారాలన్నిటిని తన భాధ్యతలను తన అనుచరులకు అప్పగించాడు. ఆధ్యాత్మికత వైపు అడుగు వేశాడు. సన్యాసం స్వీకరించి తనకు తానే “బాల కుంభ గురుముని” అని నామకరణం  చేసుకున్నారు. టోక్యోలోని తన ఇంటిని శివాలయంగా మార్చాడు. తర్వాత ఆ దేశంలో మరో కొత్త శివాలయాన్ని కూడా నిర్మించాడు. ఇప్పుడు ఉత్తరాఖండ్‌లో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు కోసం పనులు మొదలు పెట్టారు. మరోవైపు  పుదుచ్చేరిలో 35 ఎకరాల భూమిలో ఒక పెద్ద శివాలయాన్ని నిర్మిస్తున్నారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..