AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: మమ్మల్ని ఎవడ్రా ఆపేదీ.. నడిరోడ్డుపై రెచ్చిపోయిన యువ డాక్టర్లు.. చివరికి ఇలా..!

రద్దీగా ఉండే రహదారిపై మద్యం సేవించి ద్విచక్ర వాహనం నడుపుతున్న వీడియో వైరల్ కావడంతో బెంగళూరులో ముగ్గురు వైద్యులను అరెస్టు చేశారు. యువ నిపుణులు, టెకీలు ఎక్కువగా వచ్చే ప్రాంతమైన బీటీఎం లేఅవుట్‌లో ఆదివారం (మార్చి 22) రాత్రి ఈ ఘటన జరిగింది. వైరల్ అవుతున్న క్లిప్‌లో ముగ్గురు వ్యక్తులు మోటార్‌బైక్‌ను నిర్లక్ష్యంగా నడుపుతూ, ట్రాఫిక్‌లో అడ్డదిడ్డంగా వెళ్తూ కనిపించారు.

Watch: మమ్మల్ని ఎవడ్రా ఆపేదీ.. నడిరోడ్డుపై రెచ్చిపోయిన యువ డాక్టర్లు.. చివరికి ఇలా..!
Drunk Youth Caught On Camera
Balaraju Goud
|

Updated on: Mar 24, 2026 | 8:20 AM

Share

రద్దీగా ఉండే రహదారిపై మద్యం సేవించి ద్విచక్ర వాహనం నడుపుతున్న వీడియో వైరల్ కావడంతో బెంగళూరులో ముగ్గురు వైద్యులను అరెస్టు చేశారు. యువ నిపుణులు, టెకీలు ఎక్కువగా వచ్చే ప్రాంతమైన బీటీఎం లేఅవుట్‌లో ఆదివారం (మార్చి 22) రాత్రి ఈ ఘటన జరిగింది. వైరల్ అవుతున్న క్లిప్‌లో ముగ్గురు వ్యక్తులు మోటార్‌బైక్‌ను నిర్లక్ష్యంగా నడుపుతూ, ట్రాఫిక్‌లో అడ్డదిడ్డంగా వెళ్తూ కనిపించారు.

బైక్‌పై వెనుక కూర్చున్న వ్యక్తి హెల్మెట్ ధరించి, ప్రయాణ సమయంలో బీర్ బాటిల్ పట్టుకుని తాగుతూ కనిపించాడు. రైడర్, మరో వెనుక కూర్చున్న ప్రయాణికుడు హెల్మెట్లు లేకుండా కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు రేకెత్తించింది. రహదారి భద్రత పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహించడాన్ని, అలాగే పాదచారులు, వాహనదారులతో సహా ఇతర ప్రయాణికులకు కలిగే ప్రమాదాన్ని వినియోగదారులు తప్పుబట్టారు.

ఆ ఫుటేజ్ ఆధారంగా, బెంగళూరు నగర పోలీసులు స్వయంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ద్విచక్ర వాహనాన్ని, అందులో ప్రమేయం ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు చుట్టుపక్కల ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. వీడియోను క్షుణ్ణంగా విశ్లేషించిన అధికారులు.. చర్యలు చేపట్టారు. వేర్వేరు ప్రైవేట్ ఆసుపత్రులలో పనిచేస్తున్న ముగ్గురు వైద్యులను నిందితులుగా గుర్తించి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారిపై మోపిన అభియోగాలు బెయిలబుల్ కావడంతో, వారిని తర్వాత బెయిల్‌పై విడుదల చేసినట్లు చెప్పారు.

ఇదిలా ఉండగా, మార్చి 16 నుంచి 22 వరకు బెంగళూరు నగర వ్యాప్తంగా వారం రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక తనిఖీ కార్యక్రమంలో, మద్యం తాగి వాహనాలు నడిపినందుకు 634 కేసులు నమోదు చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. అతివేగ ఉల్లంఘనలకు రూ. 1.29 లక్షల జరిమానాలు వసూలు చేసినట్లు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us