
కోతులు చాలా తెలివైనవని ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఎప్పుడూ అల్లరి చిల్లరగా చెట్టు నుంచి మరో చెట్టుకు, గోడ మీద నుంచి మరో గోడకు దూకే కోతులు మహా ముదుర్లు కూడా. ఇక కోతులకు సంబంధించిన అనేక ఫన్నీ వీడియోలను మనం నిత్యం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. ఆహారం విషయానికొస్తే మానవ జాతికి మూలంగా పరిగణించే కోతుల మన చేతిలో ఏదైనా తినే పదార్థం కనిపిస్తే లాక్కునే వరకూ వదిలిపెట్టవు. ఎందుకంటే వాటికి అమెజాన్, స్విగ్గీ వంటి సర్వీసెస్ లేవు. ఆ సర్వీసెస్ను ఎలా ఉపయోగించుకోవాలో కూడా తెలియదు. అయితే టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలనే విషయాలను కోతులు కూడా క్రమ క్రమంగా నేర్చుకుంటున్నాయి. ప్రస్తుత కాలంలో బాగా అభివృద్ధి చెందిన టెక్నాలజీ కోతులకు కూడా చేరింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజీజు తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసిన కోతి వీడియోను చూస్తే మీరు ఇది నిజమే అనకుండా ఉండలేరు. జనవరి 19న కిరణ్ రిజీజు ట్వీట్ చేసిన ఈ వీడియోలో మూడు కోతులు ఒక ఫోన్ను ఆపరేట్ చేయడాన్ని మనం చూడవచ్చు. ఇందులో ఒక కోతి ఫోన్ స్క్రీన్ను స్క్రోల్ చేస్తుండగా.. పక్కన ఉన్న రెండు కోతులు దానికి సజ్జెషన్స్ ఇస్తున్నాయి. ‘డిజిటల్ విప్లవం సాధించిన విజయం ఏ స్థాయిలో ఉందో చూడండి’ అనే కాప్షన్తో కేంద్ర మంత్రి కిరణ్ రిజీజు షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.
Look at the success of digital literacy awareness reaching an unbelievable level! pic.twitter.com/VEpjxsOZa3
— Kiren Rijiju (@KirenRijiju) January 19, 2023
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..