AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamil Nadu: వేగంగా దూసుకొస్తున్న లారీ బ్రేకులు ఫెయిల్.. చివరికి ఊహించని పరిణామం

తమిళనాడులోని టోల్ ప్లాజా వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిలవ్వడంతో ఏకంగా టోల్‌ప్లాజాపైకి దూసకెళ్లడం కలకలం రేపింది. ఆ లారీని ఆపేందుకు ఓ ఉద్యేగి ప్రయాత్నించాడు. అయినా కూడా అది అదుపుతప్పి అతడ్ని ఢీకొట్టింది. అంతేకాదు అతడ్ని కొన్నికిలోమీటర్ల వరకు అలాగే ఈడ్చుకెళ్లింది. ఇంతటి దారణమైన ఘటనలో ఆ ఉద్యోగి మృతి చెందాడు.

Tamil Nadu: వేగంగా దూసుకొస్తున్న లారీ బ్రేకులు ఫెయిల్.. చివరికి ఊహించని పరిణామం
Toll Plaza
Aravind B
|

Updated on: Jul 31, 2023 | 4:15 PM

Share

తమిళనాడులోని టోల్ ప్లాజా వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిలవ్వడంతో ఏకంగా టోల్‌ప్లాజాపైకి దూసకెళ్లడం కలకలం రేపింది. ఆ లారీని ఆపేందుకు ఓ ఉద్యేగి ప్రయాత్నించాడు. అయినా కూడా అది అదుపుతప్పి అతడ్ని ఢీకొట్టింది. అంతేకాదు అతడ్ని కొన్నికిలోమీటర్ల వరకు అలాగే ఈడ్చుకెళ్లింది. ఇంతటి దారణమైన ఘటనలో ఆ ఉద్యోగి మృతి చెందాడు. ఇక వివరాల్లోకి వెళ్తే బందికోయిల్ అనే ప్రాంతంలోని నేషనల్ హైవేపై టోల్ గేట్ ఉంది. అయితే ఓ లారీ ఆ ప్రాంతానికి రాగానే దాని బ్రేకులు ఫెయిలయ్యాయి. దీంతో డ్రైవర్ కంగారుపడ్డాడు. ఎలాగైనా లారీ ఆపాలని ప్రయాత్నించాడు. ఇందుకోసం ముందుగా రోడ్డు పక్కన ఉన్న ఓ చెట్టును ఢీకొట్టి ఆపుదామని అనుకున్నాడు. కానీ దానికి దగ్గర్లోనే కొన్ని రెస్టారెంట్లు ఉన్నాయి. ఒకవేళ చెట్టును ఢీకొడితే ఆ రెస్టారెంట్‌లో ఉన్నవారు కూడా ప్రమాదానికి గురవుతారని భావించాడు. దీంతో ఆ లారీని రోడ్డుపైనే పోనిచ్చాడు. ఆ తర్వాత చివరికి టోల్‌ప్లాజా వైపు లారీ వెళ్లింది.

కానీ అక్కడ లైన్‌లో పలు వాహనాలు కనిపించాయి. దీంతో వాటిని తప్పించి ఎదురుగా కనిపిస్తున్న టోల్‌బూత్ వైపుకు డ్రైవర్ ఆ లారీని నడిపాడు.ఆ లారీని గమనించిన సతీష్ అనే ఉద్యోగి దాన్ని ఆపేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే లారీ అతడ్ని ఢీకొట్టింది. దీంతో సతీష్ అక్కడికక్కడే మృతి చెందాడు. అయినప్పటికీ ఆ లారీ వేగం మాత్రం తగ్గలేదు. ఎదురుగా వస్తున్న ఓ కారును కూడా ఢీకొట్టింది. దీంతో ఆ వాహనంలో ఉన్న ఇద్దరు ప్రయాణికులకు గాయాలయ్యాయి. అలాగే టోల్ ప్లాజాలో పనిచేసే ఓ మహిళా ఉద్యోగికి కూడా గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ లారీ ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ నుంచి కేరళలకు 30 టన్నుల బియ్యం లోడ్‌తో వెళ్తోందని పోలీసులు చెప్పారు. అలాగే ఈ లారీ డ్రైవర్ గుంటూర్ చెందిన కె. బాలకృష్ణగా గుర్తించారు.

ఇవి కూడా చదవండి
Follow Us
ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారా? 5 నిమిషాల్లో రెడీ అయ్యే రెసిపీ
ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారా? 5 నిమిషాల్లో రెడీ అయ్యే రెసిపీ
ఆసీస్‌కే దడ పుట్టించినోడిపై కన్నేసిన 3 ఐపీఎల్ టీంలు..!
ఆసీస్‌కే దడ పుట్టించినోడిపై కన్నేసిన 3 ఐపీఎల్ టీంలు..!
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి