రోడ్డుపై రూ.2 వేల నోట్ల కుప్పలు.. పోలీసులకు అందిన ఫిర్యాదు.. అసలు సంగతేంటంటే.?

| Edited By: Team Veegam

Oct 07, 2021 | 7:42 PM

ముంబైలోని వాసాయ్‌ ప్రాంతంలో రోడ్డుపై కుప్పలుకుప్పలుగా 2 వేల రూపాయల నోట్లు పడి ఉండడంతో.. వాటిని ఏరుకోవడానికి స్థానికులు ఎగబడ్డారు..

రోడ్డుపై రూ.2 వేల నోట్ల కుప్పలు.. పోలీసులకు అందిన ఫిర్యాదు.. అసలు సంగతేంటంటే.?
Notes
Follow us on

ముంబైలోని వాసాయ్‌ ప్రాంతంలో రోడ్డుపై కుప్పలుకుప్పలుగా 2 వేల రూపాయల నోట్లు పడి ఉండడంతో.. వాటిని ఏరుకోవడానికి స్థానికులు ఎగబడ్డారు. తీరా అవన్ని నకిలీ నోట్లు అని తెలియడంతో నిరాశతో వెనుదిరిగారు. కొంతమంది మాత్రం బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌పై ఫైర్‌ అయ్యారు. నోట్ల కట్టలకు షాహిద్‌కు సంబంధం ఏంటనేగా మీ అనుమానం? ఆ నకిలీ డబ్బంతా షాహిద్‌ కపూర్‌ నటిస్తున్న వెబ్‌ సిరీస్‌ ‘సన్నీ’షూటింగ్‌ కోసం ఉపయోగించినదే.

‘ఫ్యామిలీ మాన్‌’సిరీస్‌ తర్వాత రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్టాత్మక వెబ్‌ సిరీస్‌ ‘సన్నీ’.ఈ సిరీస్‌లో హీరోగా షాహిద్‌ కపూర్‌ నటించగా, విజయ్‌ సేతుపతి, రాశీ ఖన్నా, రెజీనా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సిరీస్‌ షూటింగ్‌లో భాగంగా ఓ యాక్సిడెంట్‌ సన్నివేశం ఉంది. ఆ సమయంలో 2 వేల నోట్లు రోడ్డుపై పడిపోవాలి. దీని కోసం నకిలీ నోట్లను ఉపయోగించింది చిత్ర యూనిట్‌. కానీ షూటింగ్‌ అయిపోయాక వాటిని తీసేయడం మర్చిపోయారు. దీంతో ఆ ప్రాంతంలోకి కొంతమంది అవి నిజమైన డబ్బులే అనుకొని ఏరుకునేందుకు ఎగబడ్డారు. తర్వాత అసలు విషయం తెలుసుకొని నిరాశతో వెనుదిరిగారు. ఈ విషయంపై కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గాంధీ మహాత్ముడు ఫొటో ఉన్న నోట్లను రోడ్డుపై పారేసిన వారిపై చర్యలు తీసుకోవాలని శివసేన మాజీ కార్పొరేటర్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. షూటింగ్‌కి చిత్రబృందం అనుమతి తీసుకుందని, అయితే గాంధీజీకి అవమానం జరిగిందనే విషయంపై విచారణ చేస్తున్నామని పోలీసు వర్గాలు తెలిపాయి.

Read Also:  Viral Video: చేపల వల వేసిన జాలర్లకు ఊహించని షాక్.. అందులో చిక్కింది చూసి ఫ్యూజులు ఔట్.!

సమంత-ప్రీతమ్‌‌ల మధ్య రిలేషన్ ఇదే.. క్లారిటీ ఇచ్చేసిన సామ్ మేకప్ ఆర్టిస్ట్..

పాములలో గుండె కదులుతూ ఉంటుందా.? ఆసక్తికర విషయాలు మీకోసమే.!

బంపరాఫర్‌.. అకౌంట్‌లో డబ్బు.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్‌! ఇంతకీ అసలు కథేంటంటే..