Budget 2025 : వినూత్న రీతిలో బడ్జెట్‌ 2025కి స్వాగతం పలికిన సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌.. అందులోని సందేశం ఏంటంటే..

ఈ ముఖ్యమైన రోజును ఒడిశాకు చెందిన ప్రముఖ చిత్ర కళాకారుడు, సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ తన ప్రత్యేకమైన కళ ద్వారా ఈ రోజు బడ్జెట్‌ను స్వాగతించారు. పూరీ బీచ్‌లో 4 టన్నుల ఇసుకను ఉపయోగించి 2025 బడ్జెట్‌ను వర్ణించే అద్భుతమైన కళాఖండాన్ని అతను రూపొందించాడు. దానిపై 'వెల్‌కమ్ యూనియన్ బడ్జెట్ 2025' అంటూ ఇసుకతో అద్భుతంగా లిఖించాడు.

Budget 2025 : వినూత్న రీతిలో బడ్జెట్‌ 2025కి స్వాగతం పలికిన సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌.. అందులోని సందేశం ఏంటంటే..
Sand artist Sudarsan Pattnaik crafts

Updated on: Feb 01, 2025 | 4:08 PM

2025-26 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి1 శనివారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా కేంద్రబడ్జెట్‌ యావత్‌ దేశప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ ముఖ్యమైన రోజును ఒడిశాకు చెందిన ప్రముఖ చిత్ర కళాకారుడు, సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ తన ప్రత్యేకమైన కళ ద్వారా ఈ రోజు బడ్జెట్‌ను స్వాగతించారు. పూరీ బీచ్‌లో 4 టన్నుల ఇసుకను ఉపయోగించి 2025 బడ్జెట్‌ను వర్ణించే అద్భుతమైన కళాఖండాన్ని అతను రూపొందించాడు. దానిపై ‘వెల్‌కమ్ యూనియన్ బడ్జెట్ 2025’ అంటూ ఇసుకతో అద్భుతంగా లిఖించాడు.

భారతదేశానికి చెందిన ప్రఖ్యాత పద్మశ్రీ అవార్డు పొందిన సైకత శిల్పి అయిన పట్నాయక్ ఈ సందర్భంగా వేసిన బడ్జెట్‌ చిత్రం వెనుక ఓ సందేశం ఉందంటూ తన ఆలోచనను పంచుకున్నారు. అందరూ భారతీయులతో పాటు తాను కూడా యూనియన్ బడ్జెట్ 2025పై ఎన్నో ఆశలు పెట్టుకున్నానని చెప్పాడు. అందుకే తన కళా నైపుణ్యం ద్వారా ఈ బడ్జెట్‌ను స్వాగతించాలనుకున్నట్టుగా చెప్పారు.

ఇవి కూడా చదవండి

పట్నాయక్ తన సృజనాత్మకతను ప్రదర్శించడమే కాకుండా, ఈ ముఖ్యమైన ఆర్థిక బడ్జెట్‌ వైపు దేశం, ప్రపంచం దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నించాడు. ఈ బడ్జెట్ పన్ను చెల్లింపుదారులకు, వ్యాపారాలకు మాత్రమే ముఖ్యమైనది కాదు, దేశ ఆర్థికాభివృద్ధిలో కొత్త మార్గాన్ని తెరవగలదని కూడా నిరూపించవచ్చు అని తెలియజేసే ప్రయత్నం చేశారు పట్నాయక్‌.

మరిన్ని బడ్జెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us