AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాఖీ పండగకు దూరంగా ఉంటున్న గ్రామాలు.. 300 ఏళ్లుగా అదే కారణం..!

దాదాపు నాలుగైదు శతాబ్దాలుగా వారు ఈ పండుగను పూర్తి భిన్నంగా జరుపుకుంటున్నారు. రాఖీ పూర్ణిమ రోజున ఇక్కడి మహిళలు తమ సోదరుల చేతులకు రాఖీలు కట్టరు. అందుకు బదులుగా వారు కలప కర్రలకు

రాఖీ పండగకు దూరంగా ఉంటున్న గ్రామాలు.. 300 ఏళ్లుగా అదే కారణం..!
Rakhi Festival
Jyothi Gadda
|

Updated on: Aug 06, 2022 | 11:07 AM

Share

అన్ని పండుగలలో కెల్లా రక్షా బంధన్ పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇది అతి పెద్ద పండుగలలో ఒకటి. పంచాంగం ప్రకారం, రక్షాబంధన్ పండుగను ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. దీనిని రాఖీ, రాఖీ పూర్ణిమ అని కూడా అంటారు. రక్షాబంధన్ తోబుట్టువుల మధ్య ప్రేమ, ఆప్యాయతలకు ప్రతీక. ఈ పండుగ రోజున సోదరీమణులు తమ సోదరుడి మణికట్టుపై రాఖీని కట్టి, వారి నుదిటిపై బొట్టుపెట్టి, హారతి పడతారు.. రాఖీ కట్టేటప్పుడు సోదరీమణులు దీర్ఘాయువు, ఆరోగ్యవంతమైన జీవితం, ఆనందం, శ్రేయస్సు, సంపద, వైభవం, వారి సోదరుల ఐశ్వర్యం కోసం దేవుడిని ప్రార్థిస్తారు. రాఖీ కట్టినందుకు ప్రతిఫలంగా సోదరికి సోదరుడు బహుమతులు ఇవ్వటం ఆనవాయితీ. ఆమెను జీవితాంతం కాపాడుతానని వాగ్దానం చేస్తాడు. ఈసారి పవిత్రమైన రక్షాబంధన్ పండుగను ఆగస్టు 11న జరుపుకోనున్నారు. అయితే, ఎంతో విశిష్టత కలిగిన ఈ రాఖీపౌర్ణమిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో మాత్రం అస్సలు ఈ పండుగను జరుపుకోరట. వినడానికి వింగా అనిపించినా ఇదే నిజమే.. అందుకు బలమైన కారణం ఉందని అంటున్నారు అక్కడివారు. అదేమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

యూపీలోని హార్పూర్ జిల్లా పరిధిలోని 60 గ్రామాల్లో ప్రజలు రక్షా బంధన్ జరుపుకోరట. అంటే, అందరిలా జరుపుకోరు. వారు జరుపుకునే విధానం పూర్తిగా వేరుగా ఉంటుందట.. దాదాపు నాలుగైదు శతాబ్దాలుగా వారు ఈ పండుగను పూర్తి భిన్నంగా జరుపుకుంటున్నారు. రాఖీ పూర్ణిమ రోజున ఇక్కడి మహిళలు తమ సోదరుల చేతులకు రాఖీలు కట్టరు. అందుకు బదులుగా వారు కలప కర్రల కు రాఖీలు కడతారు. అందువల్ల పండుగ నాడు ఎక్కడ చూసినా కర్రలకు రాఖీలు కనిపిస్తాయి.

ఇకపోతే, మీరట్ లోని మరో గ్రామంలో మరో విధంగా రాఖీని జరుపుకుంటారు. మీరట్‌లోని సురానా అనే గ్రామంలో పూర్వకాలం శాపం కారణంగా అక్కడ రక్షా బంధన్ జరుపుకోరు. 12వ శతాబ్దంలో రాఖీ పండుగ రోజున మహ్మద్ ఘోరీ ఆ గ్రామంపై దండెత్తాడు. ఊళ్లో ప్రజలందరినీ చంపేశాడు. ఓ మహిళ, ఆమె ఇద్దరు కొడుకులు మాత్రం బతికారు. ఎందుకంటే వారు ఆ రోజున ఊళ్లో లేరు. ఆ తర్వాత చుట్టుపక్కల ఊళ్ల వారు అక్కడ నివసించారు. ఏడాది తర్వాత వారు రాఖీ పండుగ జరుపుకుందామని ప్రయత్నించారు. ఆ రోజున ఓ పిల్లాడు ప్రమాదవశాత్తు చూపు కొల్పోయాడట. దాంతో గ్రామంలో రాఖీపండను నిషేధించారు. అలా గత 300 ఏళ్లుగా రాఖీ పండుగను బ్యాన్ చేశారు.. అప్పటి నుంచి అక్కడ రాఖీ అన్న మాట కనుమరుగైపోయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.. కానీ
స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.. కానీ
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..