AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నిద్రపోతున్న బేబీ వద్దకు చప్పుడు కాకుండా వచ్చింది.. ఆ తర్వాత…

తోటి కోడలు బిడ్డకు ఓ మహిళ విషమిచ్చి చంపేందుకు యత్నించిన ఘటన రాజస్థాన్ లోని బార్మర్ జిల్లాలో జరిగింది.పెద్ద కోడలైన మహిళ తన తోటి కోడలి బిడ్డకు గుర్తుతెలియని విషమివ్వడంతో ఆ చిన్నారి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి...

Viral Video: నిద్రపోతున్న బేబీ వద్దకు చప్పుడు కాకుండా వచ్చింది.. ఆ తర్వాత...
Rajasthani Woman
Ram Naramaneni
|

Updated on: May 25, 2024 | 12:07 PM

Share

ప్రజంట్ ఓ షాకింగ్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మే 23న NCM ఇండియా కౌన్సిల్ ఫర్ మెన్ అఫైర్స్ ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఓ మహిళ బెడ్ రూంలోకి ప్రవేశించి నిద్రిస్తున్నచిన్నారి నోట్లో విషంగా భావిస్తున్న ఏవో డ్రాప్స్ వేస్తున్నట్లు కనిపిస్తుంది. మహిళ పసిపాపకు ‘విషం’ తినిపించి, త్వరగా గది నుండి బయటకు వెళ్లిన దృశ్యాలు ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. తోటి కోడలు బిడ్డకు ఓ మహిళ విషమిచ్చి చంపేందుకు యత్నించిన ఘటన రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో జరిగింది.పెద్ద కోడలైన మహిళ తన తోటి కోడలి బిడ్డకు విషమివ్వడంతో ఆ చిన్నారి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..గతంలో చిన్న కోడలుకు చెందిన ఇద్దరు చిన్నారులకు పెద్ద కోడలు పాయిజన్ ఇవ్వడం వల్లే చనిపోయినట్లు అనుమానాలున్నాయి.

గతంలో తన ఇద్దరు పిల్లలు అనుమానాస్పద స్థితిలో.. మరణించడంతో..  పెద్దకోడలైన జెథానిపై అనుమానంతో బేబీ ఉన్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పెట్టించింది చిన్న కోడలు. దీంతో ఆమె ఘాతుకం వెలుగులోకి వచ్చింది.  అయితే ఈ ఘటనలో చిన్నారి సేఫ్‌గా బయటపడింది. 3 రోజుల పాటు ఐసీయూ చికిత్స అనంతరం కోలుకుంటోంది. కుటుంబంలో ఏదైనా విభేదాలు ఉంటే.. పెద్దల మధ్య పరిష్కరించుకోవాలి.. లేదా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాలి కానీ ఈ రకంగా.. పిల్లలా ప్రాణాలు తీస్తారా అని నెటిజన్లు భగ్గుమంటున్నారు. నిందితురాలిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

వీడియో దిగువన చూడండి… 

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..