AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పండగపూట విషాదం.. టపాసులు కాలుస్తుండగా కారు ఢీకొని యువకుడు మృతి..

రాత్రి 9 గంటల ప్రాంతంలో వేగంగా దూసుకొచ్చిన ఓ కారు సోహమ్ పటేల్ అనే యువకుడిని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఈ ప్రమాదంలో సోహమ్ పటేల్ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే కారు డ్రైవర్‌ను

పండగపూట విషాదం.. టపాసులు కాలుస్తుండగా కారు ఢీకొని యువకుడు మృతి..
Man Dies After Being Struck by Car
Jyothi Gadda
|

Updated on: Nov 03, 2024 | 8:19 PM

Share

దేశవ్యాప్తంగా దీపావళి పండగ జరుపుకుంటున్న వేళ ఓ ఇంట్లో తీరని విషాదం నిండింది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో బాణాసంచా కాల్చుతూ దీపావళి సంబరాలు జరుపుకుంటున్న ఓ యువకుడు ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోయాడు. మృత్యువు రూపంలో వేగంగా దూసుకొచ్చిన కారు 35ఏళ్ల యువకుడి ప్రాణం తీసింది. ఈ విషాద సంఘటన మహారాష్ట్రలోని పూణెలో జరిగింది. పూణెలోని పింపారి-చించ్‌వాడ్‌లోని రావత్ ప్రాంతంలో రోడ్డుపై బాణసంచా పేలుస్తుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఓ యువకుడు మరణించాడు.

రావత్ ప్రాంతంలో ఫెలిసిటీ సొసైటీ వద్ద ప్రజలంతా సంతోషంగా దీపావళి వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ క్రమంలోనే రాత్రి 9 గంటల ప్రాంతంలో వేగంగా దూసుకొచ్చిన ఓ కారు సోహమ్ పటేల్ అనే యువకుడిని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఈ ప్రమాదంలో సోహమ్ పటేల్ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే కారు డ్రైవర్‌ను ఇంకా పోలీసులు గుర్తించలేదని తెలిసింది.

ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉండగా, మరో ఘటనలో పూణేలోని సిన్హ్‌గడ్ ప్రాంతంలో స్థానిక ప్రజలు పటాకులు కాల్చుతుండగా డ్రైన్ ఛాంబర్ మూత పేలడంతో ఐదుగురు చిన్నారులు గాయపడ్డారు. నాగ్‌పూర్‌లో బాణాసంచా వేడుకలకు సంబంధించిన హింసాత్మక సంఘటన చోటు చేసుకుంది. అక్కడ 25 ఏళ్ల వ్యక్తిని యువకుడు కత్తితో పొడిచి చంపాడు. ఇలా ఆనందాల దీపావళి కొన్ని ప్రాంతాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..