Watch: ఇదేం లొల్లి పంచాయతీరా సామీ..! నడిరోడ్డుపై కర్రలతో దాడులు చేసుకున్న రెండు వర్గాలు

ఓ రెసిడెన్షియల్ సొసైటీలో సోమవారం రాత్రి రెండు గ్రూపులు ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీడియోలో ఓ మహిళ కూడా ఒక వ్యక్తిని కర్రతో కొట్టడం చూసిన అందరూ షాక్‌ అవుతున్నారు. ఒక వ్యక్తి కత్తితో..

Watch: ఇదేం లొల్లి పంచాయతీరా సామీ..! నడిరోడ్డుపై కర్రలతో దాడులు చేసుకున్న రెండు వర్గాలు
Noise Dispute Turns Violent

Updated on: Nov 05, 2024 | 5:30 PM

ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలోని రెసిడెన్షియల్ సొసైటీలో సోమవారం రాత్రి రెండు గ్రూపులు ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీడియోలో ఓ మహిళ కూడా ఒక వ్యక్తిని కర్రతో కొట్టడం చూసిన అందరూ షాక్‌ అవుతున్నారు. ఒక వ్యక్తి కత్తితో సంఘటనా స్థలానికి రావడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణకు అసలు కారణం ఏంటంటే..

గ్రేటర్ నోయిడాలోని మీనాక్షి అపార్ట్‌మెంట్‌లో ఓ వర్గం వారు అర్థరాత్రి భారీ శబ్ధాలు చేస్తున్నారంటూ మరో వర్గం వారు ఆరోపించారు. దీనిపై ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగింది. కర్రలు, రాడ్లు, దొరికిన వస్తువులతో కొట్టుకోవటంతో ఇరువైపులా ఘర్షణ తీవ్రమైంది. దీంతో అపార్ట్‌మెంట్‌ వాసులు వెంటనే పోలీసులు సమాచారం అందించారు.

ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. వారిలో ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. గ్రేటర్ నోయిడా పోలీసులు ఘర్షణకు గల కారణాలపై దర్యాప్తు చేసి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us