AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: పీకలదాకా మద్యం తాగారు.. ఇంతలో పార్టీకొచ్చిన అనుకోని అతిధి.. చివర్లో షాకింగ్ ట్విస్ట్!

మద్యం సేవించి మత్తులో తూలుతున్న వ్యక్తులు.. ఏ చేస్తారో వారికే తెలియదు. ఆ మత్తు నషా అలాంటిది మరి. ఇలాంటి..

Viral News: పీకలదాకా మద్యం తాగారు.. ఇంతలో పార్టీకొచ్చిన అనుకోని అతిధి.. చివర్లో షాకింగ్ ట్విస్ట్!
Liquor
Ravi Kiran
|

Updated on: Nov 20, 2021 | 9:49 PM

Share

మద్యం సేవించి మత్తులో తూలుతున్న వ్యక్తులు.. ఏ చేస్తారో వారికే తెలియదు. ఆ మత్తు నషా అలాంటిది మరి. ఇలాంటి సంఘటనల గురించి మనం తరచూ సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. ఎవరితోనైనా అనవసరంగా గొడవకు దిగడం.. లేదా రోడ్డుపై హల్చల్ చేయడం.. ఇలా మద్యం ప్రియుల గురించి వింత కథలను వింటూనే ఉన్నాం. ఆ కోవకు చెందిన ఓ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానిని విన్న తర్వాత మీ ఫ్యూజులు ఔట్ కావడం ఖాయం. వివరాల్లోకి వెళ్తే..

రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో అంతర్ సింగ్, జోగిందర్, శివరామ్ అనే ముగ్గురు స్నేహితులు ఓ మారుమూల ప్రాంతంలో పార్టీ చేసుకున్నారు. ఒకటి.. రెండు.. మూడు.. ఇలా దాదాపు సగం బాటిల్ లాగించారు. ఫుల్ నషాలో ఉన్నవాళ్లు ఓ పామును చూశారు. సాధారణంగా పామును చూస్తే అందరూ భయపడతారు. కానీ వీళ్లు ఏమాత్రం భయం లేకుండా దాన్ని పట్టుకున్నారు.

ఆ పామును ముగ్గురు స్నేహితులు.. మూడు ముక్కలుగా కోసుకుని.. కాల్చుకుని మరీ పరపరా తినేశారు. అంతే.. ఇంకేముంది ముగ్గురిలో ఒకరి పరిస్థితి విషమించింది. సుమారు 12 గంటల పాటు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దగ్గరలోని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా.. స్పృహలోకి వచ్చిన అతడు.. తాను పామును తిన్నట్లు చెప్పుకొచ్చాడు. అది విన్నాక అక్కడి డాక్టర్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ‘మద్యం మత్తు అతడి ప్రాణం పోయిందేదని’ నెటిజన్లు మండిపడుతున్నారు.