AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi: ఢిల్లీలో మరో దారుణం.. యువకుడ్ని 3 కిలోమీటర్లు లాక్కెళ్లిన కారు

దేశరాజధాని దిల్లీ లో అత్యంత భద్రత ఉన్న వీఐపీ జోన్‌లో జరిగిన ప్రమాదం ఆలస్యంగా వెలుగుచూసింది. శనివారం రాత్రి కస్తుర్బాగాంధీ మార్గ్‌, టోల్‌స్తోయ్‌ మార్గ్ సమీపంలో ద్విచక్రవాహనంపై వెళ్తోన్న ఇద్దరు వ్యక్తులను ఓ కారు వేగంగా ఢీ కొట్టింది. దాంతో ఓ వ్యక్తి కొన్ని అడుగుల దూరం ఎగిరిపడగా.. మరో వ్యక్తి కారు పైభాగంపై పడిపోయాడు.

Delhi: ఢిల్లీలో మరో దారుణం.. యువకుడ్ని 3 కిలోమీటర్లు లాక్కెళ్లిన కారు
Accident
Aravind B
|

Updated on: May 03, 2023 | 9:56 PM

Share

దేశరాజధాని దిల్లీ లో అత్యంత భద్రత ఉన్న వీఐపీ జోన్‌లో జరిగిన ప్రమాదం ఆలస్యంగా వెలుగుచూసింది. శనివారం రాత్రి కస్తుర్బాగాంధీ మార్గ్‌, టోల్‌స్తోయ్‌ మార్గ్ సమీపంలో ద్విచక్రవాహనంపై వెళ్తోన్న ఇద్దరు వ్యక్తులను ఓ కారు వేగంగా ఢీ కొట్టింది. దాంతో ఓ వ్యక్తి కొన్ని అడుగుల దూరం ఎగిరిపడగా.. మరో వ్యక్తి కారు పైభాగంపై పడిపోయాడు. కానీ డ్రైవర్‌ మాత్రం ఆ కారును అలాగే వేగంగా ముందుకు తీసుకెళ్లాడు. దాదాపు మూడు కిలోమీటర్లు వెళ్లిన తర్వాత దిల్లీ గేట్ సమీపంలో పైభాగంలో ఉన్న వ్యక్తిని కిందికి పడేసి, కారు డ్రైవర్‌ పారిపోయాడు. అప్పటికే తీవ్ర గాయాలతో ఉన్న ఆ బాధితుడు ఆ తర్వాత మరణించాడు. గాయపడిన మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. కానీ వారి పేర్లను ఇంకా బయటకు వెల్లడించలేదు.

అయితే ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి పేరు దీపాన్షు వర్మ. ఇతను ఒక ఆభరణాల దుకాణాన్ని నడుపుతున్నాడు. తల్లిదండ్రులకు ఇతనొక్కడే కొడుకు. అయితే కొద్ది నెలల క్రితం దిల్లీలో ఇలాంటి తరహా ఘటనే చోటుచేసుకుంది. ఓ యువతి నడుపుతోన్న బైక్‌ను ఢీకొన్న కారు.. ఆమె శరీరాన్ని కొన్ని కిలోమీటర్లపాటు ఈడ్చుకెళ్లింది. దీంతో ఆ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం దుమారం రేపిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
ఏపీలోని ఓటర్లకు అద్బుత అవకాశం
ఏపీలోని ఓటర్లకు అద్బుత అవకాశం
పాక్ 7 వికెట్లు పీకేస్తే.. టీమిండియా 8 మందిని పక్కన పెట్టింది
పాక్ 7 వికెట్లు పీకేస్తే.. టీమిండియా 8 మందిని పక్కన పెట్టింది
మనిషి అనుకుని చాట్‌జీపీటీతో బామ్మ ముచ్చట్లు.. వీడియో చూస్తే..
మనిషి అనుకుని చాట్‌జీపీటీతో బామ్మ ముచ్చట్లు.. వీడియో చూస్తే..
పదో తరగతి పరీక్షల్లో మార్కుల కుమ్మరింత.. మూల్యాంకనంపై విమర్శలు!
పదో తరగతి పరీక్షల్లో మార్కుల కుమ్మరింత.. మూల్యాంకనంపై విమర్శలు!
గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు.. ప్రజలకు పోలీసుల కీలక హెచ్చరికలు
గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు.. ప్రజలకు పోలీసుల కీలక హెచ్చరికలు
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం నుంచి ఊరట..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం నుంచి ఊరట..
చుక్క నీళ్లు లేకుండా ఎక్కువ గ్రేవీతో నోరూరించే 'చికెన్ ఫ్రై'..
చుక్క నీళ్లు లేకుండా ఎక్కువ గ్రేవీతో నోరూరించే 'చికెన్ ఫ్రై'..
ఓనం వేళ..అమెరికాలో ఇద్దరి హత్య!వారితో కలిసుండే మహిళే నిందితురాలు!
ఓనం వేళ..అమెరికాలో ఇద్దరి హత్య!వారితో కలిసుండే మహిళే నిందితురాలు!
వాటర్ ట్యాంక్ పక్కన తచ్చాడుతూ కనిపించిన ఇద్దరు.. అనుమానం వచ్చి
వాటర్ ట్యాంక్ పక్కన తచ్చాడుతూ కనిపించిన ఇద్దరు.. అనుమానం వచ్చి
అమౌంట్ రాశాక చివరిలో ‘Only’ అనే పదం ఎందుకు ఉపయోగిస్తారు..?
అమౌంట్ రాశాక చివరిలో ‘Only’ అనే పదం ఎందుకు ఉపయోగిస్తారు..?