AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పె…ద్ద రోజు! ఈ ఏడాదిలోనే ఎక్కువ గంటలు పగలు ఉండే రోజు ఇదే.. కారణం?

ప్రతి సంవత్సరం జూన్ 21 ఖగోళ, ఆధ్యాత్మికంగా ప్రత్యేకమైనది. అంతర్జాతీయ యోగా దినోత్సవం, సమ్మర్ సోల్‌స్టిస్ ఈ రోజే. ఉత్తరార్ధగోళంలో పొడవైన పగలు ఉంటుంది. ఈ రోజున సూర్య భగవానుడిని పూజించడం వలన ఆరోగ్యం, శ్రేయస్సు కలుగుతాయని విశ్వాసం. అర్ఘ్యం, మంత్ర జపాలు, ఆదిత్య హృదయం, దానధర్మాలు శుభ ఫలితాలనిస్తాయి.

పె...ద్ద రోజు! ఈ ఏడాదిలోనే ఎక్కువ గంటలు పగలు ఉండే రోజు ఇదే.. కారణం?
Summer Solstice
SN Pasha
|

Updated on: Jun 21, 2026 | 8:31 AM

Share

ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీ ఖగోళ, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పరంగా ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటారు. అదే సమయంలో ఉత్తరార్ధగోళంలో సంవత్సరంలోనే అత్యంత పొడవైన పగలు, అత్యంత చిన్న రాత్రి ఉండే సమ్మర్ సోల్‌స్టిస్ కూడా ఇదే రోజు సంభవిస్తుంది. ఈ సందర్భంగా సూర్యుడు తన గరిష్ట ఉత్తర స్థానానికి చేరుకుంటాడని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

భారతీయ సనాతన సంప్రదాయంలో సూర్య భగవానుడిని జీవశక్తికి, ఆరోగ్యానికి, జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు. అందువల్ల జూన్ 21న సూర్యారాధన చేయడం అత్యంత పుణ్యప్రదమని విశ్వసిస్తారు. ఈ రోజున భక్తిశ్రద్ధలతో సూర్యుడిని పూజిస్తే ఆనందం, శ్రేయస్సు, కీర్తి, ఆరోగ్య ఆశీస్సులు లభిస్తాయని పురాణాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు పేర్కొంటాయి. ఖగోళ శాస్త్రం ప్రకారం ఈ రోజున భూమి ఉత్తర ధ్రువ భాగం సూర్యుని వైపు ఎక్కువగా వంగి ఉంటుంది. దీంతో సూర్యకాంతి భూమిపై ఎక్కువసేపు ప్రసరిస్తుంది. భారతీయ విశ్వాసాల ప్రకారం ఈ కాలం తర్వాత సూర్యుడు దక్షిణ దిశగా ప్రయాణం ప్రారంభిస్తాడని, దీనిని దేవతల రాత్రి ఆరంభానికి సంకేతంగా భావిస్తారు. అందుకే ఈ సమయాన్ని దానధర్మాలు, జపతపాలు, ఆధ్యాత్మిక సాధనలకు అనుకూలమైనదిగా పరిగణిస్తారు.

ఈ రోజున ఉదయం స్నానం చేసిన అనంతరం రాగి పాత్రలో నీటిని తీసుకుని, అందులో ఎర్రటి పువ్వులు, బియ్యం, కుంకుమ కలిపి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. అర్ఘ్యం ఇస్తూ “ఓం సూర్యాయ నమః” లేదా “ఓం ఘృణి సూర్యాయ నమః” మంత్రాలను జపించడం ద్వారా సానుకూల శక్తి లభిస్తుందని విశ్వాసం. అలాగే ఆదిత్య హృదయ స్తోత్రం పఠించడం కూడా విశేష ఫలితాలను ఇస్తుందని భక్తులు నమ్ముతారు. శ్రీరాముడు రావణుడితో యుద్ధానికి ముందు ఈ స్తోత్రాన్ని పఠించాడని పురాణాల్లో పేర్కొనబడింది. అదేవిధంగా ఎర్రటి వస్త్రాలు, బెల్లం, గోధుమలు, రాగి పాత్రలు వంటి వాటిని దానం చేయడం కూడా శుభఫలితాలను ఇస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. సమయం తక్కువగా ఉన్నవారు కనీసం సూర్యునికి జలాభిషేకం చేసి “ఓం ఘృణి సూర్యాయ నమః” మంత్రాన్ని 11 సార్లు జపించినా సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు.

Follow Us
ఈ ఏడాదిలోనే ఎక్కువ గంటలు పగలు ఉండే రోజు ఇదే.. కారణం?
ఈ ఏడాదిలోనే ఎక్కువ గంటలు పగలు ఉండే రోజు ఇదే.. కారణం?
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
జీవితంలో తొలి హీరో నాన్నే.. ఫాదర్స్ డే సందర్భంగా ప్రేమతో ఈ విషెస్
జీవితంలో తొలి హీరో నాన్నే.. ఫాదర్స్ డే సందర్భంగా ప్రేమతో ఈ విషెస్
రోహిత్ శర్మ భవిష్యత్తుపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంచలన వ్యాఖ్యలు
రోహిత్ శర్మ భవిష్యత్తుపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంచలన వ్యాఖ్యలు
NEET అలర్ట్.. డ్రెస్ కోడ్ నుంచి ID కార్డు వరకు ఇవి తెలుసుకోండి
NEET అలర్ట్.. డ్రెస్ కోడ్ నుంచి ID కార్డు వరకు ఇవి తెలుసుకోండి
హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే వాటర్ బాటిల్‌తో ఇలా చేయాలంట.. ఎందుకంటే?
హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే వాటర్ బాటిల్‌తో ఇలా చేయాలంట.. ఎందుకంటే?
‘మా ఇంటి బంగారం’ మూవీని రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?
‘మా ఇంటి బంగారం’ మూవీని రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?
మాంసం కూరలను తలదన్నే వంకాయ కర్రీ.. చెట్టినాడు స్టైల్‌లో
మాంసం కూరలను తలదన్నే వంకాయ కర్రీ.. చెట్టినాడు స్టైల్‌లో
తక్కువ ధరకే రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ బైక్.. చూస్తే షాకే
తక్కువ ధరకే రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ బైక్.. చూస్తే షాకే
సిగ్నల్‌ కట్ కావడాన్ని లైట్‌గా తీసుకుంటే అకౌంట్ ఖాళీ
సిగ్నల్‌ కట్ కావడాన్ని లైట్‌గా తీసుకుంటే అకౌంట్ ఖాళీ