
భారతదేశానికి ఆగస్టు 15, 1947న స్వాతంత్య్రం సిద్ధించింది. నాడు మనం పొందినది కేవలం రాజకీయ స్వేచ్ఛ మాత్రమే కాదు, దేశ ఆర్థిక ప్రయాణంలో కూడా అది ఒక నూతన శకానికి నాంది పలికింది. ఆ సమయం నుండి నేటి వరకు గత ఏడు దశాబ్దాల పైచిలుకు కాలంలో అనేక వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. ముఖ్యంగా భారతీయులు అత్యంత పవిత్రంగా, సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం సాధించిన వృద్ధి అపారమైనది. స్వాతంత్య్ర దినోత్సవం వేళ, నాటి బంగారం ధరలు, నేటి వాటి విలువను ఒక్కసారి పరిశీలిద్దాం.
1947లో భారత్ స్వతంత్ర దేశంగా అవతరించినప్పుడు 10 గ్రాముల (తులం) 24 క్యారెట్ల బంగారం ధర కేవలం రూ.88.62 మాత్రమే. ఆ సమయంలో సామాన్యుడి నెలవారీ ఆదాయం చాలా తక్కువగా ఉన్నప్పటికీ, బంగారం వెల నేటి ధరలతో పోలిస్తే ఊహించని విధంగా తక్కువగా ఉండేది. కాలక్రమేణా, ద్రవ్యోల్బణం, ప్రజల ఆదాయం పెరిగేకొద్దీ రూపాయి విలువ తగ్గుతుంది. గత 80 ఏళ్లలో బంగారం ధర 1700 రెట్లకు పైగా పెరిగింది.
ఒకవేళ 1947లో ఎవరైనా నాటి రూ. 5,000 నగదును బంగారంలో పెట్టుబడి పెట్టి ఉంటే, ఆ గణాంకాలు ఇప్పుడు షాక్ అయ్యేలా చేస్తాయి. ఈ రోజు మీరు 1 గ్రాము కూడా రూ. 5,000లకు కొనలేరు. కానీ, 1947లో మీరు ఈ డబ్బుతో 500 గ్రాముల కంటే ఎక్కువ బంగారం కొనుండవచ్చు. ఆ సమయంలో మీ కుటుంబ పెద్దలు బంగారంలో కొద్దిగా పెట్టుబడి పెట్టి ఉన్నా,పెట్టుబడిఒకవేళ అలా జరిగి ఉంటే, ఈ రోజు దాని విలువ కోట్లలో ఉండేది. ఈ కాలంలో బంగారం ధర 1726 రెట్లు పెరిగింది. అంటే, 1947లో తులం ధర రూ.88.62 చొప్పున, రూ.5,000 కు సుమారు 564.2 గ్రాముల (56 తులాలకు పైగా) బంగారం వచ్చేది.
ప్రస్తుతం బంగారం, వెండి ధరలలో తీవ్ర హెచ్చుతగ్గులు నెలకొన్నాయి. గత కొన్ని రోజులుగా ధరలు పెరుగుతూ వచ్చాయి. కానీ, ఈరోజు తగ్గుదల కనిపిస్తోంది. ఈ తగ్గుదల తర్వాత కూడా, 10 గ్రాముల బంగారం ధర రూ. 1,52,000 పైనే ఉంది.
భారతదేశంలో బంగారాన్ని కేవలం పెట్టుబడి కోసమే కాకుండా, సంప్రదాయం కోసం కూడా కొనుగోలు చేస్తారు. దీపావళి, అక్షయ తృతీయ వంటి ప్రత్యేక పండుగల సందర్భంగా బంగారం కొనడం చాలా కుటుంబాలలో ఒక సంప్రదాయంగా ఉంది. ఇది కాకుండా, వివాహ వార్షికోత్సవాలు, పుట్టినరోజులు, అనేక ఇతర పండుగల సందర్భంగా బంగారం కొనుగోలు చేసే ఆచారం సంవత్సరాలుగా కొనసాగుతోంది. ప్రస్తుతం, సామాన్య ప్రజలు బంగారం, వెండి ధరలు తగ్గుతాయా అని ఎదురుచూస్తున్నారు.
ఈ గణాంకాలు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సంక్షోభ సమయాల్లో ఎంతటి ఆర్థిక హెచ్చుతగ్గులు వచ్చినా, బంగారం తన కొనుగోలు శక్తిని కోల్పోకుండా సంపదను కాపాడుతూనే వచ్చింది. అందుకే తరతరాలుగా భారతీయుల మొదటి ప్రాధాన్యత కలిగిన పెట్టుబడి మార్గంగా పసిడి నిలుస్తోంది!
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..