AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తల్లిదండ్రుల మృతదేహాలను కూడా తినే వింత జాతి.. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశం ఇది..!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషుల్లో అనేక రకాలవారు ఉన్నారు. వారిలో విభిన్న తెగలు కూడా ఉన్నాయి. ఈ తెగలు వారి సంప్రదాయాలు, జీవనశైలి, ఆహారపు అలవాట్లతో ప్రసిద్ధి చెందాయి. ఈ గిరిజన వర్గాలు ఇప్పటికీ వేల సంవత్సరాల నాటి సంప్రదాయాలను పాటిస్తున్నారు. ఈ తెగలకు వారు నివసించే ప్రదేశంపై పూర్తి అధికారం ఉంటుంది. ప్రభుత్వాలు కూడా వారి హక్కులలో జోక్యం చేసుకోవు. ఇలాంటి తెగలలో కొన్ని చాలా ప్రమాదకరమైనవి కూడా ఉన్నాయి.. అలాంటి విచిత్ర, భయంకరమైన సంప్రదాయం కొనసాగిస్తున్న తెగ ఒకటి ఉంది. ఇందుకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

తల్లిదండ్రుల మృతదేహాలను కూడా తినే వింత జాతి.. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశం ఇది..!
Fore Tribe
Jyothi Gadda
|

Updated on: May 03, 2025 | 5:40 PM

Share

పాపువా న్యూ గినియాలో కనిపించే ఒక తెగను చాలా ప్రమాదకరమైనదిగా భావిస్తారు. ఈ తెగ దాని వింత ఆచారాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును పొందింది. వారి సంప్రదాయం గురించి తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఈ తెగలో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియల సమయంలో ఆ మనిషి మెదడును తినే సంప్రదాయం ఉందట.. ! బాబోయ్‌ వింటేనే ఒళ్లు గగ్గుర్పొడిచే ఈ వార్త పాపువా న్యూ గినియాలో కనిపించే ఫోర్ తెగకు సంబంధించినది. అసలా కథేంటంటే..

బ్రిటన్, పాపువా న్యూ గినియాలో నాలుగు తెగలు కనిపిస్తాయి. ఈ తెగ ప్రజలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించగా ఒక ఆశ్చర్యకరమైన విషయం వెల్లడైంది. గిరిజనుల ఆహారంలో చనిపోయిన బంధువుల మెదళ్ళు కూడా ఉన్నాయి. నివేదికల ప్రకారం1960ల వరకు, ఈ తెగ వారి బంధువుల మరణానంతరం వారిని దహనం చేయడం లేదా పూడ్చిపెట్టడం కంటే వారిని తినే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారని శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఈ తెగవారిలో పురుషులు తమ చనిపోయిన బంధువుల మాంసాన్ని తింటారట. అలాగే, మహిళలు మెదడులను మాత్రమే తింటారట. పైగా ఇక్కడి గిరిజన ప్రజలు తమ ప్రియమైన వారి పట్ల గౌరవానికి చిహ్నంగా ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తారటి.. ఒక మృతదేహాన్ని ఎక్కడైనా పూడ్చిపెట్టినా లేదా వదిలేసినా, కీటకాలు దానిని తింటాయని ఈ తెగలు నమ్మేవారు. మరణించిన వ్యక్తిని ప్రేమించేవారు ఆ శరీరాన్ని తినడం మంచిదని వారు నమ్ముతారు. ఇక్కడి ఆడవాళ్లు చనిపోయిన వ్యక్తి శరీరం నుండి మెదడును తీసివేసి, వెదురులో వేసి వండుకుంటారట. అలా చనిపోయిన వ్యక్తి పిత్తాశయం తప్ప శరీరం నుండి వచ్చిన మాంసమంతా కాల్చి తింటారట.

ఇవి కూడా చదవండి

అయితే, ఈ తెగ ప్రజలకు మనిషి మెదడు తినటం వల్ల ప్రాణాంతకమైన వ్యాధులు సంభవిస్తాయని, దాంతో ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటుందని తెలియదు. కానీ, ఈ వ్యాధి కారణంగా తెగ జనాభాలో దాదాపు రెండు శాతం మంది మరణించారు. చివరకు1950లలో మానవ శాస్త్రవేత్త షిర్లీ లిండెన్‌బామ్ ఈ ఆచారం గిరిజన ప్రజలలో ఒక మానసిక రుగ్మత అని కనుగొన్నారు. ఈ వ్యాధిని కురు అంటారు. కురు అనేది నయం చేయలేని నాడీ సంబంధిత వ్యాధి. ఇది నాడీ వ్యవస్థను దాదాపుగా నిలిపివేస్తుంది. ఇది ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న వ్యక్తి మెదడు తినడం వల్ల వచ్చి ఉండవచ్చని అంటున్నారు.. అది ఇతరులకు వ్యాపించి దేశాన్ని విధ్వంసం వైపు నడిపించే అవకాశం కూడా ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
పాకంతో పనిలేని తొక్కుడు లడ్డు.. ఇంట్లోనే స్వీట్ షాప్ రుచి..
పాకంతో పనిలేని తొక్కుడు లడ్డు.. ఇంట్లోనే స్వీట్ షాప్ రుచి..
తండ్రిపై లైంగిక ఆరోపణలు చేసిన హీరోయిన్.. దెబ్బకు 22 కేసులు నమోదు.
తండ్రిపై లైంగిక ఆరోపణలు చేసిన హీరోయిన్.. దెబ్బకు 22 కేసులు నమోదు.
ఒక్క ప్లేట్ పానీపూరీ రూ.830.. ఎక్కడంటే..
ఒక్క ప్లేట్ పానీపూరీ రూ.830.. ఎక్కడంటే..
మీరు తాగే పాలు స్వచ్ఛమైనవేనా? ఇంట్లోనే ఈ 5 సులభ పరీక్షలతో కల్తీ ప
మీరు తాగే పాలు స్వచ్ఛమైనవేనా? ఇంట్లోనే ఈ 5 సులభ పరీక్షలతో కల్తీ ప
అమ్మమ్మ అంత్యక్రియలకని వచ్చాడు.. కట్‌చేస్తే.. శ్మాశానంలోనే
అమ్మమ్మ అంత్యక్రియలకని వచ్చాడు.. కట్‌చేస్తే.. శ్మాశానంలోనే
ఇంటికే వచ్చి ఉచితంగా బ్లడ్‌ టెస్ట్ శాంపిల్స్.. US యువతి రియాక్షన్
ఇంటికే వచ్చి ఉచితంగా బ్లడ్‌ టెస్ట్ శాంపిల్స్.. US యువతి రియాక్షన్
భారత్‌-యూకే మధ్య చారిత్రాత్మక ఒప్పందం..మన వస్తువులపై జీరోట్యాక్స్
భారత్‌-యూకే మధ్య చారిత్రాత్మక ఒప్పందం..మన వస్తువులపై జీరోట్యాక్స్
సేవింగ్స్ అకౌంట్లో అంతకుమించి ట్రాన్సాక్షన్లు చేస్తే జైలుకే..
సేవింగ్స్ అకౌంట్లో అంతకుమించి ట్రాన్సాక్షన్లు చేస్తే జైలుకే..
పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు: ఈ 10 విశేషాలు తెలిస్తే ఆశ్చర్యపోవా..
పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు: ఈ 10 విశేషాలు తెలిస్తే ఆశ్చర్యపోవా..
3000లకు పైగా సాంగ్స్ చేశా..
3000లకు పైగా సాంగ్స్ చేశా..