
భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద రైల్ నెట్వర్క్ , ఆసియాలో మొదటిది. భారతదేశంలో మొదటి ప్యాసింజర్ ట్రైన్ 1853 ఏప్రిల్ 16న ముంబైలోని బోరీ బందర్ నుంచి తానే వరకు 34 కి.మీ. ప్రయాణించింది. జమ్మూ కాశ్మీర్లోని చెనాబ్ రైల్ బ్రిడ్జ్ ప్రపంచంలోనే అతి ఎత్తైనది (359 మీటర్లు), హిమాలయాల్లో ఉంది. రోజుకు 2.3 కోట్ల మంది ప్రయాణికులను తీసుకెళ్తుంది, ఇది కొన్ని దేశాల జనాభా కంటే ఎక్కువ.
14.3 లక్షల మంది ఉద్యోగులతో ప్రపంచంలోనే 7వ అతి పెద్ద సంస్థ. ఇది ఒక చిన్న దేశ ఆర్థిక వ్యవస్థలా పనిచేస్తుంది. అతి వేగవంతమైనది వందే భారత్ ఎక్స్ప్రెస్ (160 కి.మీ./గం), నీలగిరి పర్వత రైల్వేలో కొన్ని ప్రత్యేక ప్రదేశాలలో ఇంజిన్ లేకుండా నడిచే ప్రత్యేకమైన రైలు ఉంది. ఇది గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించి వాలులపైకి జారిపోతుంది. అతి నెమ్మది మెట్టుపాలయం-ఊటీ నీలగిరి ప్యాసింజర్ (సగటు 10 కి.మీ./గం). ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జంక్షన్ ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ను కలిగి ఉంది. ఇది 1,366 మీటర్లు (1.3 కి.మీ కంటే ఎక్కువ) పొడవు ఉంటుంది. త్వరలో హుబ్బల్లి జంక్షన్ (1,505 మీటర్లు)ది ఈ రికార్డు కానుంది.
భారతీయ రైల్వేలు 4 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ డార్జిలింగ్, నిల్గిరి, కాల్కా-షిమ్లా మౌంటైన్ రైల్వేలు, చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ కు యజమాని 855లో తయారైన ఫెయిరీ క్వీన్ స్టీమ్ లోకోమోటివ్ ఇంకా పనిచేస్తోంది. 1986లో న్యూ ఢిల్లీలో మొదటి కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ సిస్టమ్ ప్రారంభమైంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..