Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drugs In Chennai: చెన్నైలో మరోమారు భారీ డ్రగ్స్ స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్.. విలువ ఎంతంటే..

శ్రీలంక నుంచి చెన్నైకి డ్రగ్స్ సరఫరాచేస్తున్న ముఠాను అధికారులు అరెస్ట్‌ చేశారు.. డ్రగ్స్‌ రాకెట్‌కు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్టుగా అధికారులు వెల్లడించారు. వీరిద్దరు శ్రీలంకకు చెందిన విజయ్‌కుమార్, మణివణ్ణన్ లుగా గుర్తించారు.

Drugs In Chennai: చెన్నైలో మరోమారు భారీ డ్రగ్స్ స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్.. విలువ ఎంతంటే..
Drugs Worth Rs. 27 Crore
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 29, 2024 | 8:41 PM

తమిళనాడులో మరోభారీ డ్రగ్స్‌ రాకెట్‌ గుట్టు రట్టైంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో చెన్నైలో రూ. 27 కోట్ల విలువైన మెథాంఫెటమైన్‌ను స్వాధీనం చేసుకుంది. శ్రీలంక నుంచి చెన్నైకి డ్రగ్స్ సరఫరాచేస్తున్న ముఠాను అధికారులు అరెస్ట్‌ చేశారు.. డ్రగ్స్‌ రాకెట్‌కు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్టుగా అధికారులు వెల్లడించారు. వీరిద్దరు శ్రీలంకకు చెందిన విజయ్‌కుమార్, మణివణ్ణన్ లుగా గుర్తించారు. వీరి వద్ద నుండి రూ.15 లక్షల నగదు, 1.9 కిలోల మెథాంఫెటమైన్ (ఐసిఇ) స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు డ్రగ్స్‌ విక్రయం ద్వారా వచ్చిన నగదుగా భావిస్తున్నారు.

విజయ్‌కుమార్ – కన్యాకుమారి శరణార్థి శిబిరంలో నివసిస్తున్న శ్రీలంక జాతీయుడుగా అధికారులు తెలిపారు. డ్రగ్స్‌ను శ్రీలంకకు రవాణా చేయాలనే ఉద్దేశ్యంతో మాదకద్రవ్యాల సరుకును సేకరించడానికి చెన్నైకి వెళ్లినట్లు ఎన్‌సిబి దర్యాప్తు అధికారులు తెలిపారు. తదుపరి సోదాల్లో మణివణ్ణన్ ఇంట్లో అదనంగా 900 గ్రాముల మెథాంఫేటమిన్ గుర్తించారు.. ఇద్దరు అనుమానితులను విచారిస్తున్నారు. ఈ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌లో మరిన్ని లింక్‌లను గుర్తించడానికి అన్ని కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నారు అధికారులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..