AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మవారి దర్శనం చేసుకుని వస్తుండగా అద్భుతం.. చిన్నరాయితో..దెబ్బకు లక్షధికారి

నవరాత్రి సమయంలో ఒక దినసరి కూలీ జీవితమే మారిపోయింది, దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించిన తర్వాత కోటీశ్వరుడు అయ్యాడు. ఈ అద్భుతమైన కథ ఎవరినైనా ఆశ్చర్యపరుస్తుంది. మధ్యప్రదేశ్‌లోని పన్నాలో నవరాత్రి సమయంలో ఒక దినసరి కూలీ అదృష్టం ప్రకాశించింది. నిమిషాల్లోనే కోటీశ్వరుడు అయ్యాడు. దుర్గాదేవి ఆలయం నుంచి తిరిగి వస్తుండగా.. రోడ్డు పక్కన 4.04 క్యారెట్ల వజ్రం అతనికి దొరికింది. దీని విలువ 1.5 మిలియన్ల రూపాయలకు పైగా ఉంటుంది.

అమ్మవారి దర్శనం చేసుకుని వస్తుండగా అద్భుతం.. చిన్నరాయితో..దెబ్బకు లక్షధికారి
Laborer Fortunes Changed During Navratri (2)
Surya Kala
|

Updated on: Oct 02, 2025 | 5:00 PM

Share

వీధిలో నడుస్తూ అకస్మాత్తుగా మిమ్మల్ని కోటీశ్వరుడిని చేసే వస్తువు ఏదైనా దొరికిందని ఊహించుకోండి.. అది ఒక కలలా అనిపించవచ్చు. అయితే ఇది నిజం చేస్తూ ఒక సంఘటన చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని పన్నాలో ఒక దినసరి కూలీ కొన్ని నిమిషాల్లోనే కోటీశ్వరుడు అయ్యాడు. నవరాత్రి సమయంలో అతను దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించాడు. ప్రార్థనలు చేసి తిరిగి వస్తుండగా.. రోడ్డుపై మెరిసే ఒక వస్తువు కనిపించింది.

ఆ కార్మికుడు దానిని తీసుకున్నాడు. అది అమూల్యమైన వజ్రం. అతను వెంటనే దానిని వజ్రాల షాక్ కి తీసుకెళ్లాడు. దీని విలువ తెలిసిన తర్వాత అతను చాలా సంతోషించాడు. ఎందుకంటే అది 4.04 క్యారెట్ల నాణ్యత గల వజ్రం. దీని విలువ 1.5 మిలియన్ రూపాయలకు పైగా ఉంటుంది. ఈ విషయజం తెలిసిన తర్వాత ఆ కార్మికుడు ఇదంతా అమ్మవారి దయ.. అద్భుతం అని చెప్పాడు.

ఖేరా మాత దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా అదృష్టం మెరిసింది. ఈ సంఘటన రహునియా గుజార్ గ్రామంలో జరిగింది. గోవింద్ సింగ్ అనే ఆదివాసి కార్మికుడు. అతను ఉదయం దుర్గాదేవి ఆలయాన్ని (ఖేరా మాత) సందర్శించి తిరిగి వస్తుండగా.. రోడ్డు పక్కన మెరుస్తున్న రాయిని చూశాడు. దానిని తీసుకొని ఇంటికి తీసుకువచ్చాడు.

ఇవి కూడా చదవండి

గోవింద్ సింగ్ కుటుంబ సభ్యులు ఆ రాయిని చూడగానే..”ఇది వజ్రంలా కనిపిస్తోంది” అని ఆశ్చర్యపోయారు. గోవింద్ వెంటనే తన కుటుంబ సభ్యులతో కలిసి వజ్రాల ఆఫీసుకి వెళ్లి మెరిసే రాయిని వజ్రాల నిపుణుడికి దానిని ఇచ్చాడు. అప్పుడు ఆ నిపుణుడు ఆ వజ్రాన్ని పరిశీలించి.. అది 4.04 క్యారెట్ల నాణ్యత గల వజ్రంగా నిర్ధారించాడు. ఆ వజ్రం విలువ 1.5 మిలియన్ల రూపాయలకు పైగా ఉంటుందని నిపుణుడు గోవింద్‌తో చెప్పాడు.

ఆ కార్మికుడికి ఇంతకు ముందు కూడా ఒక వజ్రం లభ్యం

ఆ వజ్రం విలువ 1.5 మిలియన్ల రూపాయలకు పైగా ఉంటుందని వజ్ర నిపుణుడు చెప్పగానే తన కుటుంబం మొత్తం ఆనందంతో ఉప్పొంగిపోయిందని కార్మికుడు గోవింద్ సింగ్ అన్నాడు. గోవింద్ ఈ అమూల్యమైన వజ్రాన్ని కార్యాలయంలో జమ చేశాడు. తనకు నలుగురు వివాహిత కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారని చెప్పాడు. మొత్తం కుటుంబం కూలీలుగా పనిచేస్తామని.. ఒక ఎకరం భూమి ఉందని.. దానిలో కూరగాయలు పండిస్తామని చెప్పాడు. ఇప్పుడు అమ్మవారు తన విన్నపాన్ని విని.. ఇప్పుడు వజ్రం ఇచ్చిందని చెప్పాడు. వజ్రం అమ్మగా వచ్చిన డబ్బుతో ఇల్లు కట్టుకుని ట్రాక్టర్ కొనుక్కుని తన కుటుంబాన్ని పోషించుకోవడానికి కష్టపడి పనిచేస్తానని ఆయన వివరించారు. గతంలో కూడా తవ్వుతున్నప్పుడు 2.50 క్యారెట్ల వజ్రం దొరికిందని.. అయితే దాని ధర అంత ఎక్కువ రాలేదని గోవింద్ వెల్లడించాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..