Viral News: ఉచితంగా హెల్మెట్‌ ఇవ్వలేదని షోరూమ్‌ యజమానిపై కేసు నమోదు.. దిగొచ్చిన కంపెనీ..

Viral News: కొత్త బైక్ కొనుగోలు చేస్తే ఉచితంగా హెల్మెట్ ఇవ్వలేదన్న కారణంగా ఓ వ్యక్తి షోరూమ్‌ యజమానిపై కేసు నమోదు చేశాడు. దీంతో ఏకంగా సదరు బైక్‌ కంపెనీ సీఈఓనే స్పందించాల్సి వచ్చింది. ఈ విచిత్రమైన ఘటన పుణెలోని కోత్రుడ్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే..

Viral News: ఉచితంగా హెల్మెట్‌ ఇవ్వలేదని షోరూమ్‌ యజమానిపై కేసు నమోదు.. దిగొచ్చిన కంపెనీ..
Follow us

|

Updated on: Apr 15, 2022 | 3:35 PM

Viral News: కొత్త బైక్ కొనుగోలు చేస్తే ఉచితంగా హెల్మెట్ ఇవ్వలేదన్న కారణంగా ఓ వ్యక్తి షోరూమ్‌ యజమానిపై కేసు నమోదు చేశాడు. దీంతో ఏకంగా సదరు బైక్‌ కంపెనీ సీఈఓనే స్పందించాల్సి వచ్చింది. ఈ విచిత్రమైన ఘటన పుణెలోని కోత్రుడ్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. అభిషేక్‌ హరిదాస్‌ అనే ఓ వ్యక్తి స్థానికంగా ఉన్న ఓ బైక్‌ షోరూమ్‌లో ఇటీవల బైక్‌ను కొనుగోలు చేశాడు. ఆ సమయంలో బైక్‌ షోరూమ్‌ వాళ్లు హెల్మెట్‌లు ఇవ్వలేదు. అయితే 2019లో ముంబయి హైకోర్టు ఔరంగబాద్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పు ప్రకారం బైక్‌ కొనుగోలు చేసిన వారికి రెండు హెల్మెట్‌లు ఉచితంగా ఇవ్వాల్సి ఉంటుంది. దీనిని అతిక్రమించారన్న కారణంగా అభిషేక్‌ షోరూమ్ పై కేసు నమోదు చేశాడు.

ఈ విషయమై అభిషేక్‌ మాట్లాడుతూ.. ‘హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు బైక్‌ కొనుగోలు చేసే సమయంలో షోరూమ్‌ వాళ్లు ఉచితంగా హెల్మెట్‌లు ఇవ్వకపోతే ఆర్‌టీఓ ఆఫీసులో బైక్‌ రిజిస్ట్రేషన్‌ చేయకూడదు. కానీ నాకు షోరూమ్‌ వాళ్లు హెల్మెట్‌ ఇవ్వకపోయినా బైక్‌ రిజిస్ట్రేషన్‌ చేశారు. షోరూమ్‌ వాళ్లను ఎంత అడిగినా హెల్మెట్‌లు ఇవ్వలేదు’ అని చెప్పుకొచ్చారు. అభిషేక్‌ తరఫు న్యాయవాదులు షోరూమ్‌ యజమానికి లీగల్‌ నోటీసులు జారీ చేశారు. అయితే వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో అభిషేక్‌ పోలీసులను ఆశ్రయించి కేసు నమోదు చేశాడు.

ఇదిలా ఉంటే విషయం కాస్త పెద్దది కావడంతో సదరు కంపెనీ దిగొచ్చింది. అభిషేక్‌ తరఫు లాయర్లు జారీ చేసిన నోటీసులు అందిన వెంటనే, హెల్మెట్లు తీసుకోవడానికి అతన్ని పిలిచినట్లు కంపెనీ సీఈఓ ప్రదీప్‌ సావంత్‌ తెలిపారు. అయితే అభిషేక్‌ రాలేదని, గురువారం కూడా అతని కోసం ఎదురు చూశామని, అభిషేక్‌ ఎప్పుడు వచ్చినా హెల్మెట్‌లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

Also Read: KTR: వరి పంటతో రాజకీయ చలిమంటలు వేసుకోవాలని ప్రయత్నించారు.. బీజేపీపై కేటీఆర్ ఫైర్

Pakistan: పాకిస్థాన్‌లో భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుపై ఏకంగా రూ.100..

KKR vs SRH Playing 11 IPL 2022: కేకేఆర్‌తో పోరుకు సిద్ధమైన హైదరాబాద్.. ప్లేయింగ్ XIలో కీలక మార్పులు..

ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..