YS Sharmila: మంత్రి కేటీఆర్‌కు మద్దతుగా వైఎస్ షర్మిల ట్వీట్.. ఆ వ్యాఖ్యలు ఖండించాల్సేందేనంటూ..

YS Sharmila Supports Minister KTR: తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మంత్రి కేటీఆర్ కొడుకు హిమాన్షుపై.. తిన్మార్ మల్లన్న పోల్ నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు

YS Sharmila: మంత్రి కేటీఆర్‌కు మద్దతుగా వైఎస్ షర్మిల ట్వీట్.. ఆ వ్యాఖ్యలు ఖండించాల్సేందేనంటూ..
Ys Sharmila Ktr

Updated on: Dec 25, 2021 | 9:38 AM

YS Sharmila Supports Minister KTR: తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మంత్రి కేటీఆర్ కొడుకు హిమాన్షుపై.. తిన్మార్ మల్లన్న పోల్ నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మంత్రి కేటీఆర్ సైతం ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ట్విట్ చేశారు. తాము ఎవ్వరిపై వ్యక్తిగత విమర్శలకు దిగడం లేదని అలాంటప్పుడు కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగి ఇబ్బందులకు గురి చేయడం ఏంటంటూ ప్రశ్నించారు. బీజేపీ నేతలు తన కుమారుడిని రాజకీయాల్లోకి లాగడం సిగ్గుచేటంటూ మండిపడ్డారు. అభివృద్ధి ఎక్కడ జరిగింది.. భద్రాచలం గుడిలోనా.. హిమాన్షు శరీరంలోనా..? అంటూ తీన్మార్‌ మల్లన్న పోల్‌ నిర్వహించడంపై కేటీఆర్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఫిర్యాదు చేశారు.

తెలంగాణ బీజేపీ నేతలకు నేర్పించేది ఇదేనా అంటూ కేటీఆర్ ఫైర్‌ అయ్యారు. తన కుమారుడిని రాజకీయాల్లోకి లాగడం, అతడి శరీరాకృతిని అవమానించడం సంస్కారమేనా అంటూ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. దిగజారుడు వ్యాఖ్యలు చేయకుండా నియంత్రించాలని.. ఇలాంటి వ్యాఖ్యలు చేయించాల్సిన పరిస్థితి తమకు కల్పించవద్దంటూ మంత్రి కోరారు. కాగా.. దీనిపై వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు.

Also Read:

PM Narendra Modi: యేసుక్రిస్తు జీవితం, బోధనలు అందరికీ స్ఫూర్తిదాయకం.. శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

Shampoo: షాంపూల్లో క్యాన్సర్‌ కారకాలు.. 30 ఉత్పత్తులను వెనక్కి తీసుకున్న కంపెనీ.. ఎక్కడంటే?

Loading...
Unable to load recommendations.
Follow Us