Telangana: ఆస్తి కోసం సొంత అన్నను చంపిన రౌడీషీటర్.. రుద్రంగిలో హైటెన్షన్..

|

Jun 16, 2022 | 5:31 PM

రుద్రంగికి చెందిన నేవూరి నర్సయ్య, కిషన్‌లు అన్నదమ్ములు. వీరి మధ్య ఐదేళ్ల నుంచి భూమి హద్దుల వివాదం నడుస్తోంది. సమస్య పరిష్కారానికి పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు.

Telangana: ఆస్తి కోసం సొంత అన్నను చంపిన రౌడీషీటర్.. రుద్రంగిలో హైటెన్షన్..
Crime News
Follow us on

Telangana Crime News: అన్నదమ్ముల మధ్య భూ వివాదం హత్యకు దారి తీసింది. ట్రాక్టర్‌తో గుద్ది అన్నను హతమార్చి పోలీసుల ఎదుట లొంగిపోయాడు తమ్ముడు. రాజన్న సిరిసిల్ల జిల్లా (rajanna sirisilla district) రుద్రంగిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. రుద్రంగికి చెందిన నేవూరి నర్సయ్య, కిషన్‌లు అన్నదమ్ములు. వీరి మధ్య ఐదేళ్ల నుంచి భూమి హద్దుల వివాదం నడుస్తోంది. సమస్య పరిష్కారానికి పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. అయితే.. ఇప్పుడు ఆ గొడవ కాస్తా ముదిరి హత్యకు దారి తీసింది. ఈ క్రమంలో రుద్రంగి మండల కేంద్రంలో నేవూరి నరసయ్య (42 ) ను కిషన్ ట్రాక్టర్తో ఢీకొట్టి హతమార్చాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.

తన భర్తను చంపిన నిందితుడిని తమకు అప్పచెప్పాలంటూ డెడ్‌బాడీతో పోలీస్‌ స్టేషన్‌ ముందు ధర్నాకు దిగింది మృతుని భార్య. లేదంటే మీరే చంపేయాలంటూ ఊరంతా స్టేషన్‌ను ముట్టడించారు. ఈ క్రమంలో పోలీస్‌ స్టేషన్ లోకి చొచ్చుకెళ్లేందుకు మృతుడి బంధువులు నప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో లాఠిఛార్జ్ కూడా చేశారు.

నిందితుడిని తమకు అప్పగించాలని నరసయ్య బంధవులు డిమాండ్ చేస్తున్నారు. అయితే.. పోలీసులు నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా వినకుండా ధర్నాకు దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా బలగాలను మోహరించారు. సమీపంలోని చందుర్తి పోలీసులను కూడా రుద్రంగికి పంపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..