Hyderabad: వీడిన మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య మిస్టరీ.. అసలేం జరిగిందంటే

|

May 04, 2023 | 8:32 PM

ఇటీవల హైదరాబాద్‌లోని శాలిబండ పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఓ మహిళా కానిస్టేబుల్‌ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇన్‌స్పెక్టర్‌ కిషన్‌ తెలిపిన వివరాల ప్రకారం..రంగారెడ్డి జిల్లా, కందుకూరు మండలం, జైత్వారం గ్రామానికి చెందిన సురేఖ(28) ఛత్రినాక పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించేది.

Hyderabad: వీడిన మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య మిస్టరీ.. అసలేం జరిగిందంటే
Death
Follow us on

ఇటీవల హైదరాబాద్‌లోని శాలిబండ పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఓ మహిళా కానిస్టేబుల్‌ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇన్‌స్పెక్టర్‌ కిషన్‌ తెలిపిన వివరాల ప్రకారం..రంగారెడ్డి జిల్లా, కందుకూరు మండలం, జైత్వారం గ్రామానికి చెందిన సురేఖ(28) ఛత్రినాక పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించేది. అలియాబాద్‌ కాల్వగడ్డ ఏడు గుళ్ల ప్రాంతంలో తల్లిదండ్రులు, సోదరితో కలిసి ఉండేది. 2018 బ్యాచ్‌కు చెందిన సురేఖ ఇటీవల భవానీనగర్‌ పోలీసు స్టేషన్‌కు బదిలీ అయినప్పటికీ ఇంకా అక్కడి నుంచి రిలీవ్‌ కాలేదు.

అయితే గతేడాది సురేఖకు పెళ్లి సంబంధం కుదిరి కొన్ని కారణాల వల్ల రద్దైపోయింది. తాజాగా ఈనెల 1న తమ స్వగ్రామానికి చెందిన ఓ యువకుడితో సురేఖకు నిశ్చితార్థం జరిగింది. అయితే ఇది జరిగాక పెళ్లి కుమారుడు పెళ్లి కూతురికి వరుసకు కొడుకు అవుతాడని, జాతకాలు కూడా కుదరడం లేదని ఇరుకుటుంబాలు చర్చించుకుంటుండడంతో ఈ సంబంధం కూడా రద్దైపోయింది. తనకు ఇక పెళ్లి జరగదేమోనని సురేఖ మనస్తాపానికి గురైంది. ఈనెల 2న సురేఖ సోదరి ఉద్యోగానికి వెళ్లి 3న ఉదయం 11 గంటలకు ఇంటికి తిరిగి వచ్చింది. ఇంటి తలుపులు లోపలి నుంచి గడియ పెట్టి ఉండడం, ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో స్థానికులు తలుపులు బద్దలుకొట్టి చూడగా సురేఖ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని కనిపించింది. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..