AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harish Rao: కాంగ్రెస్ కు పట్టిన గతే బీజేపీకి పడుతోంది.. మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో కాంగ్రెస్ కు పట్టిన గతే బీజేపీకి పడుతుందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. మెదక్ జిల్లా, శివ్వంపేట మండలంలోని దొంతి జీవన్‌దివ్య గార్డెన్‌లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు.

Harish Rao: కాంగ్రెస్ కు పట్టిన గతే బీజేపీకి పడుతోంది.. మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు
Harish Rao
Aravind B
|

Updated on: Mar 31, 2023 | 3:34 PM

Share

రాష్ట్రంలో కాంగ్రెస్ కు పట్టిన గతే బీజేపీకి పడుతుందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. మెదక్ జిల్లా, శివ్వంపేట మండలంలోని దొంతి జీవన్‌దివ్య గార్డెన్‌లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీజీపీ లపై విమర్శలు గుప్పించారు. అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వం ఏం చేసుకుంటారో చేసుకోండని అన్నారని.. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నోరు కూడా మెదపలేదని మండిపడ్డారు. కానీ రాష్ట్రం వచ్చాక కాంగ్రెస్ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు.

అలాగే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు, నవోదయలు, నర్సింగ్ కాలేజీలు, కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదని..కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని విమర్శించారు. గత 9 ఏళ్లలో పెట్రోల్, డీజీల్ పై సెస్సుల రూపంలో తెలంగాణ నుంచి కేంద్రం 89,967 కోట్లు వసూలు చేసిందని ఆరోపించారు. పెద్దనోట్లు రద్దు చేసి జన్ ధన్ ఖాతాలో వేస్తనన్న డబ్బులు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేకపోయారని దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వం అదాని ఆస్తి పెంచితే.. సీఎం కేసీఆర్ ప్రజల ఆస్తిని పెంచారన్నారు. రాష్ట్రంలో రైతు బంధు, రైతు బీమా కళ్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్టు లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఆకలి కేకలు లేకుండా చేశామని వివరించారు. నాడు అట్టడగులో ఉన్న తెలంగాణ నేడు దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. ఏది అడిగినా ఇవ్వకుండా రాష్టానికి బీజేపీ అన్యాయం చేస్తోందని విమర్శించారు. ఎవరికీ ఏ కష్టం వచ్చినా 24 గంటలు తన ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి