
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉండనుంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఒక్క పూట బడులపై ప్రభుత్వం అధికారిక ఉత్తర్వలు ఇచ్చింది. . 2025 మార్చి 15వ తేదీనుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు, ఎయిడెడ్ ఇతర అన్ని మేనేజ్మెంట్ల పరిధిలోని బడులు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పాఠశాలు ఉంటాయని వెల్లడించింది. 12:30 మధ్యాహ్న భోజనం అందిస్తారని తెలిపింది. లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్ 23 వరకూ హాఫ్ డే స్కూల్స్ కొనసాగనున్నాయి. అయితే.. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు కొనసాగే పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో సూచించారు.
BREAKING: తెలంగాణలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు #Telangana pic.twitter.com/lDKn90fmEv
— Janardhan Veluru (@JanaVeluru) March 13, 2025
కాగా సెలవుల కోసం విద్యార్థులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. ఏప్రిల్ 24 నుంచి సెలవులు ప్రకటించి.. తిరిగి జూన్ 12 నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్లు సమాచారం.