Telangana: కలకలం సృష్టిస్తున్న కల్తీ పెట్రోల్.. దిక్కున్న చోట చెప్పుకోండంటూ యాజమాన్యం హూంకరింపులు..!
Telangana: ఒకవైపు డైలీ పెరుగుతోన్న పెట్రో ధరలతో వాహనదారులు అల్లాడుతుంటే, మరోవైపు కల్తీ పెట్రోల్తో దోపిడీ పాల్పడుతున్నాయి
Telangana: ఒకవైపు డైలీ పెరుగుతోన్న పెట్రో ధరలతో వాహనదారులు అల్లాడుతుంటే, మరోవైపు కల్తీ పెట్రోల్తో దోపిడీ పాల్పడుతున్నాయి కొన్ని పెట్రోల్ బంకులు. కామారెడ్డి జిల్లా టేక్రియాల్లో కల్తీ పెట్రోల్ కలకలం రేపింది. కల్తీ పెట్రోల్తో వాహనదారులతో చెలగాటం ఆడుతోంది తేజ పెట్రోల్ బంక్. టేక్రియాల్ గ్రామ శివారులో జాతీయ రహదారి 44పై ఉన్న బంకులో పదేపదే పెట్రోల్ కల్తీ జరుగుతోందని అంటున్నారు వాహనదారులు. పెట్రోల్ పోయించుకున్న తర్వాత బండి ఆగిపోవడంతో కల్తీ బాగోతం బయటపడిదంటున్నారు బాధితుడు రమేష్. అయితే, ఇది మొదటిసారి కాదంటున్నాడు బాధితుడు. గతంలోనూ పెట్రోల్లో కల్తీ జరిగిందని, నీళ్లు కలిపి అమ్ముతున్నారని అంటున్నాడు. లీటర్ పెట్రోల్లో 40శాతం నీళ్లే ఉంటున్నాయంటున్నారు బాధితులు. కల్తీ పెట్రోల్ను బాటిల్లో నింపుకొచ్చి బంకు సిబ్బందితో ఆందోళనకు దిగాడు బాధితులు. అయితే, బంకు మేనేజర్తోపాటు సిబ్బంది ఎదురు దాడికి దిగారు. దురుసు ప్రవర్తించడంతోపాటు మీ దిక్కున్న చోటు చెప్పుకోండని బెదిరించడంతో కలెక్టరేట్లో కంప్లైంట్ చేశారు బాధితులు. గతంలో కూడా అనేకసార్లు ఈ పెట్రోల్ బంకులో కల్తీ జరిగిందని, చర్యలు తీసుకోవాలని కోరారు.