CM Revanth Reddy: ఆ జిల్లా వాసులకు సీఎం అదిరిపోయే గుడ్ న్యూస్.. త్వరలోనే కోట్ల రూపాయలతో..
రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో టాప్ ఉంటానే ఉద్దేశంలో తెలంగాణ సర్కార్ ఎప్పికప్పుడూ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. ఇందులో భాగంగానే ఉత్తర తెలంగాణలోని బాసర పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇక ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 6వ తేదీన బాసరలో పర్యటించనున్న ఆయన ఆలయ అభివృద్ధి కోసం రూ.300 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

రాష్ట్ర అభివృద్ది తెలంగాణ సర్కార్ ఎప్పికప్పుడూ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటంది. ఇప్పటికే మేడారం ఆలయాన్ని అభివృద్ది చేసిన ప్రభుత్వం రాష్ట్రంలోని మరో ఆలయంలో అభివృద్ది పనులను చేపట్టేందుకు సిద్ధమైంది. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 6వ తేదీన బాసరలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి ఆలయ అభివృద్ధి కోసం రూ.300 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో భాగంగానే బాసర ఆలయ అభివృద్ధిపై ఉన్నతాధికారులతో శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. బాసర ఆలయ అభివృద్ధికి సంబంధించి మాస్టర్ ప్లాన్ పై అధికారులతో చర్చించారు.
ఇక ఈ సోమవారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి ఇప్పటికే ఆలయానికి చేరుకొని ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. బాసర ఆలయాన్ని ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని రూ.500 కోట్లతో కుంభమేళా తరహాలో ఏర్పాట్లు చేయనున్నట్లు ఆయన తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ప్రణాళికలు అమలయితే బాసర పుణ్యక్షేత్రానికి దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు లభిస్తుందన్నారు.
అందే కాదు ఆదిలాబాద్ జిల్లాలోని సాగునీటి, విద్యా రంగాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని సుమారు రూ.600 కోట్లతో అభివృద్ది పనులను ప్రభుత్వం చేపట్టబోతున్నట్టు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు ఆదిలాబాద్ జిల్లా అభివృద్దిలో కీలకంగా మారనున్నాయన్నారు. అలాగే బోథ్ నియోజకవర్గంలో రూ.1200 కోట్లతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్కు సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి జూపల్లి తెలిపారు. కార్పొరేట్ స్కూల్కు దీటుగా ఈ పాఠశాలనను ప్రభుత్వం తీర్చదిద్దబోతుందన్నారు.
సీఎం ఆదిలాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా హుత్నూర్ మండలం పీపీ గ్రామంలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సీఎం మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ చెక్కులు, సీఎం కప్ అవార్డులు అందజేయనున్నారు. అలాగే గ్రామ పంచాయతీలకు ఐఎస్ఓ సర్టిఫికేషన్లు ప్రదానం చేయనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
