Harish Rao: గెల్లు చేతిలో ఓడతానన్నది ఈటల భయం.. అందుకే నన్ను పోటీకి పిలుస్తున్నారు : ఆర్థిక మంత్రి హరీశ్ రావు

హుజురాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ చేతిలో ఓడతానన్నది ఈటల భయం అన్నారు ఆర్థిక మంత్రి హరీశ్ రావు. "అందుకే నన్ను పోటీకి

Harish Rao: గెల్లు చేతిలో ఓడతానన్నది ఈటల భయం.. అందుకే నన్ను పోటీకి పిలుస్తున్నారు : ఆర్థిక మంత్రి హరీశ్ రావు
Harish Rao
Follow us

|

Updated on: Sep 12, 2021 | 6:15 PM

Huzurabad By Election Campaign: హుజురాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ చేతిలో ఓడతానన్నది ఈటల భయం అన్నారు ఆర్థిక మంత్రి హరీశ్ రావు. “అందుకే నన్ను పోటీకి పిలుస్తున్నారు. నేనైనా, గెల్లు అయినా ఈటలపై గెలుపు ఖాయం.” అని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వ్యతిరేక పార్టీ అని హరీశ్ వ్యాఖ్యానించారు. ఇవాళ జమ్మికుంటలో నిర్వహించిన సభలో ఆర్థిక మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఇల్లందకుంటకు చెందిన బీజేపీ యువ నేత అజయ్ యాదవ్ నేతృత్వంలో 500 మంది తెరాసలో చేరారు.

ఈ సమావేశంలో హరీశ్ ప్రసంగిస్తూ..” గెల్లు శ్రీనివాస్ పేరులోనే గెలుపు ఉంది. ఆయన ఎక్కడికి పోయినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇంతకముందే హుజురాబాద్ టౌన్ లోని 3 వేల మంది మున్నూరు కాపులు ఏకగ్రీవ తీర్మానం చేసి గెల్లును గెలిపిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసి 130 కేసులున్న గెల్లు శ్రీనివాస్ ను గెలిపించాలి. తెలంగాణ అసెంబ్లీలో మూడు తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించినా ఇప్పటి వరకు స్పందన లేదు. బీసీలకు మంత్రిత్వశాఖ పెట్టాలని, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని, దేశంలో బీసీల జనాభా లెక్కించాలని కోరాం.. వీటిపై స్పందన లేదు.” అని హరీశ్ రావు చెప్పుకొచ్చారు.

“ఇటీవల కేరళ నుంచి మురళీధరన్ అనే కేంద్ర మంత్రిని తెచ్చి ఇక్కడ మాట్లాడించారు. 28 మంది బీసీలకు కేంద్రమంత్రి పదవులిచ్చామని ఆయన గొప్పలు చెప్పాడు. కానీ బీసీలకోసం ఓ మంత్రిని ఎందుకు పెట్టలేదు. బీజేపీ అంటేనే దళిత, గిరిజన, మైనార్టీ, బలహీనవర్గాల వ్యతిరేక పార్టీ. టీఆర్ఎస్ పార్టీ.. ఇప్పటి వరకు ప్రజల కోసం తెచ్చిన సంక్షేమ పథకాలు, చేసిన పనులు చెప్పి ఓటడుగుతోంది. మరి మీరేం చెప్పి ఓటడుగుతారు? గ్యాస్, పెట్రోలు, డీజీల్ ధరలు పెంచామని ఓటడుగుతారా? ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్ముతున్నందుకు ఓటగుతారా? కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ గెలిచి కనీసం ఒక్క కమ్యూనిటీ హాలైనా కట్టాడా? మరి ఈటల ఆ పార్టీ నుంచి గెలిచి ఏం చేయగలడు? అంటూ హరీశ్ ప్రశ్నలు కురిపించారు.

“ఈటల మాటలు చూస్తే.. ప్రస్టేషన్ కనిపిస్తోంది. ఓటమి భయం పట్టుకున్నట్లుంది. ఆయన సహానాన్నే కాదు.. విజ్ఞతను కూడా కోల్పోయాడు. దళిత ఎమ్మెల్యేలను పట్టుకుని నీ సంగతి చూస్తానని, రారా, పోరా అని మాట్లాడుతున్నాడు. ఓడిపోతానన్న భయంతోనే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. యువకుడైన, కార్యకర్త చేతిలో గెల్లు శ్రీనివాస్ చేతిలో ఓడిపోతున్నాననే భయం పట్టుకుంది. అందుకే ప్రతి సారి నన్ను పోటీకి రమ్మంటున్నాడు. ఓడిపోయినా మంచిదే కానీ.. పెద్దోళ్ల చేతిలో ఓడిపోదామనుకుంటున్నాడు. నీకు మా గెల్లు శ్రీను చాలు. నేను ఇక్కడ పోటీచేస్తే మా గెలుస్తా.. కానీ మళ్లీ సిద్ధిపేటకు ఉప ఎన్నిక ఎందుకు? నేను అవసరం లేదు.. తప్పకుండా గెల్లు శ్రీనివాస్ ను గెలిపించుకునేందుకు అన్ని వర్గాలు కదలుతున్నారు.” అని హరీశ్ అన్నారు.

“ప్రతి రోజు వందల మంది టీఆర్ఎస్ లో చేరుతున్నారు. మొదట్లో నీ మొసలి కన్నీరుచూసి, నీ మాయమాటలు నమ్మి కొందరు నీ వైపు వచ్చారు. కానీ పాలేవో, నీళ్లేవో వాళ్లకు అర్థమై మళ్లీ మా దగ్గరకు వస్తున్నారు. ప్రజలకు అన్ని విషయాలు అర్థమైపోయి.. టీఆర్ఎస్ వైపు నిలబడుతున్నారు. గెల్లు శ్రీనివాస్ కు ఎన్నికల డిపాజిట్ మేమే కడుతామని హుజురాబాద్ మెకానిక్ లు నిన్న చెప్పారు. రెండు గుంటలున్న బిడ్డకు ఆస్తులు లేకపోవచ్చు. కానీ ఆయనలో ప్రేమ ఉంది. ఓటేసే ముందు ఆడబిడ్డలంతా సిలిండర్ కు దండం పెట్టుకుని పోలింగ్ బూత్ కు వెళ్లండి. అప్పుడు మీ చేయి సరిగ్గా కారు గుర్తు దగ్గరకే పోతుంది. సిలిండర్ ధర పెంచిన బీజేపీకి మీరు ఓటువేసారో.. మళ్లీ వెయ్యి నుంచి 1500 అవుతుంది జాగ్రత్త. నాకు తెలిసి ఆడబిడ్డలెవరూ బీజేపీకి ఓటేయరు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రయివేటికరిస్తే.. ఇక రిజర్వేషన్లు ఉండవు. ఉద్యోగాలిచ్చే పార్టీ టీఆర్ఎస్… ఉద్యోగాలు ఊడగొట్టే పార్టీ బీజేపీ” అని హరీశ్ కేంద్రంలోని బీజేపీ సర్కారు మీద ఘాటు విమర్శలు ఎక్కుపెట్టారు.

Read also: Raja Singh: హుస్సేన్ సాగర్‌లో కాకుండా ఎక్కడ నిమజ్జనం చేయాలో పోలీసులు చెప్పాలి: ఎమ్మెల్యే రాజాసింగ్

12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు