
తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాల్లో బీఈ/ బీటెక్/ బీఫార్మసీ కోర్సుల్లో రెండో సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ఈసెట్-2023 ప్రవేశ పరీక్ష ఫలితాలు జూన్ 13న విడుదలయ్యాయి. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి సాయంత్రం 4 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది 93.07 శాతం మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. ఉస్మానియా యూనివర్శిటీ ఆధ్వర్యంలో మే 20న ఆ ఈ పరీక్ష నిర్వహించారు. దాదాపు 22 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు.
పాలిటెక్నిక్, బీఎస్సీ(గణితం) పూర్తి చేసిన విద్యార్థులకు ఈసెట్లో సాధించిన ర్యాంకుల ఆధారంగా బీఈ/ బీటెక్/ బీఫార్మసీ కోర్సుల్లో రెండో సంవత్సరంలో నేరుగా ప్రవేశాలు కల్పిస్తుంటారు. ఫలితాలు తెలుసుకోవడానికి ఈ లింక్ పైన క్లిక్ చేయండి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.