Telangana Budget 2026 Live: రూ.3లక్షల 24 వేల 234 కోట్లతో తెలంగాణ 2026-27 బడ్జెట్
Telanagana Budget 2026 live updates in Telugu:తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి . సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 2026-27 ఆర్థిక వార్షిక బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్ ప్రస్తుతం ఉన్న దాని కంటే 10 శాతం పెరిగి 3 లక్షల 35 వేల కోట్లకు చేరుకుంది.

LIVE NEWS & UPDATES
-
రూ.3లక్షల 24 వేల 234 కోట్లతో తెలంగాణ బడ్జెట్
రూ.3లక్షల 24 వేల 234 కోట్లతో తెలంగాణ బడ్జెట్
రెవెన్యూ వ్యయం రూ.2 లక్షల 34 వేల 406 కోట్లు
మూలధన వ్యయం రూ. 47వేల 267 కోట్లు
-
అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న డిప్యూటీ సీఎం భట్టి
ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ
సభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
-
-
తెలంగాణ అసెంబ్లీలో పాము కలకలం
మీడియా పాయింట్ సమీపంలో కనిపించిన పాము
అసెంబ్లీకి వచ్చే మార్గంలో కనిపించిన పాము
వెంటనే అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు
పామును చాకచక్యంగా పట్టుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంకటేశ్
వెంకటేష్ నాయక్ను అభినందించిన అధికారులు
-
తెలంగాణ 2026-27 బడ్జెట్కు కేబినెట్ ఆమోదం
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత జరిగిన కేబినెట్ భేటీ
తెలంగాణ వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలిపిన కేబినెట్
రూ.3.35 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ అవకాశం
గతంలో పోల్చుకుంటే ఈ సారి పెరిగిన బడ్జెట్
-
కాసేపట్లో తెలంగాణ బడ్జెట్
బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీకి బయలుదేరే ముందు ప్రజాభవన్లో ఉన్న నల్లపోచమ్మ ఆలయంలో భట్టివిక్రమార్క ప్రత్యేక పూజలు
బడ్జెట్ ప్రతులను అమ్మవారి ముందుంచి పూజలు నిర్వహించిన డిప్యూటీ సీఎం
రాష్ట్ర ప్రభుత్వానికి సమృద్ధిగా ఆదాయం రావాలి -భట్టి
సంక్షేమ పథకాలు మరింత విస్తృతంగా ప్రజలకు చేరాలి – భట్టి
ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలి: భట్టి
-
-
తెలంగాణ బడ్జెట్కు కేబినెట్ ఆమోదం
మూడున్నర లక్షల కోట్లు ఉంటుందని అంచనా
కాసేపట్లో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న భట్టి
-
కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ
కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతుంది
మంత్రవర్గం బడ్జెట్కి ఆమోదం తెలపనుంది
అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనమండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెడుతారు
బడ్జెట్ ప్రస్తుతం ఉన్న దాని కంటే 10 శాతం పెరిగి 3 లక్షల 35 వేల కోట్లకు చేరుకునే అవకాశం ఉంది
ప్రజాసంక్షేమం, విద్య, వ్యవసాయ రంగాలపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది
రైతు భరోసా, రైతు బీమా, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి పథకాలకు భారీ కేటాయింపులు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
సన్నవడ్లకు 500 రూపాయల బోనస్, సబ్సిడీ బియ్యం పథకాలకు నిధులు కేటాయించబోతున్నారు
కల్యాణలక్ష్మి కింద ఇచ్చే మొత్తాన్ని లక్షా 30 వేలకు పెంచే అవకాశం ఉంది
-
ఈ సారి బడ్జెట్లో ప్రజాసంక్షేమం, విద్య, వ్యవసాయ రంగాలపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.సన్నవడ్లకు 500 రూపాయల బోనస్, సబ్సిడీ బియ్యం పథకాలకు నిధులు కేటాయించబోతున్నారు. రైతు భరోసా, రైతు బీమా, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి పథకాలకు భారీ కేటాయింపులు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకానికి నిధులు, పాఠశాలల్లో ముఖ్యమంత్రి బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ప్రతిపాదించే అవకాశం ఉంది . దీని వల్ల 21 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.
అలాగే గిరిజనుల కోసం కొత్త చట్టానికి సంబంధించి బడ్జెట్లో ప్రస్తావించబోతున్నట్టు తెలుస్తోంది. దేవాదాయ శాఖలో వృద్ధ అర్చకులకు పెన్షన్ ఇచ్చే ప్రతిపాదన ఉండబోతుందున్నట్లు తెలుస్తోంది. పారా అథ్లెట్లకు ఇళ్ల స్థలాలు, ప్రోత్సాహకాల కోసం నిధులు కేటాయించే అవకాశం ఉంది. అలాగే కల్యాణ లక్ష్మి కింద అదనంగా 30 వేల రూపాయలు ఇచే అంశాన్ని ప్రతిపాదించబోతున్నారు. అప్పుడు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి కింద అందించే మొత్తం లక్షా 30 వేలు అవుతుంది. ఈ సారి బడ్జెట్లో ఉద్యోగుల EHS హెల్త్ స్కీమ్ కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించబోతున్నట్టు సమాచారం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Published On - Mar 20,2026 10:39 AM




