Hyderabad: దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం.. ఫలక్నుమా వైపు వెళ్లే పలు రైళ్లు పాక్షికంగా రద్దు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Hyderabad: ఫలక్నుమా స్టేషన్లో ట్రాక్ల పునరుద్ధరణ పనుల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి రోజూ సికింద్రాబాద్ ,..

Hyderabad: ఫలక్నుమా స్టేషన్లో ట్రాక్ల పునరుద్ధరణ పనుల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి రోజూ సికింద్రాబాద్ , కాచిగూడ నుంచి బయలుదేరే పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. ఫలక్నుమా స్టేషన్లో ట్రాక్ పునరుద్ధరణ పనులను సులభతరం చేయడానికి దక్షిణ మధ్య రైల్వే ట్రాఫిక్ను నిలిపివేసింది.
ఫలక్నుమా నుండి లింగంపల్లి వెళ్లే రైలు నంబర్లు 47157 (), 47176 , 47165 రైళ్లు ఈ నెల 9వ తేదీ , 15, 16, 22 , 23 తేదీల్లో రద్దు చేయబడ్డాయి.
కాచిగూడ నుంచి ఫలక్నుమా వరకూ ప్రయాణించే .. ఇంగం పల్లి నుండి ఫలక్నుమా వెళ్లే రైలు నంబర్లు 47212 తో పాటు.. ఫలక్నుమా నుండి లింగంపల్లి వెళ్లే 47214 రైలు జనవరి 9, 15, 16, 22 , 23 తేదీలలో పాక్షికంగా రద్దు చేయబడ్డాయి.
సికింద్రాబాద్ నుండి ఉమ్దానగర్ ప్రయాణించే రైలు నంబర్లు 07055, మేడ్చల్ నుండి ఉమ్దానగర్ ప్రయాణించే 07075 నెంబర్ రైలు జనవరి 9, 16 , 23 తేదీలలో పాక్షికంగా రద్దు చేయబడ్డాయని దక్షిణ మధ్య రైల్వే సంస్థ అధికారులు ప్రకటించారు.
Also Read: