Agnipath Scheme Protest: రోజంతా ఆందోళనలతో అట్టుడికిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నార్మల్ పరిస్థితికి చేరుకుంది. పరిస్థితి అదుపులోకి రావడంతో స్టేషన్ పరిసరాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైల్వే స్టేషన్నుంచి తరలించారు. రాత్రి 7 గంటలకు స్టేషన్ను తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు.. రైల్వే అధికారులకు రైళ్లను పునరుద్దరించారు. దాదాపు 9 గంటల పాటు రైళ్ల రాకపోకలు నిలిచి పోయాయి. పరిస్థితులు సద్దుమణగడంతో రైల్వే అధికారులు షెడ్యూల్ రైళ్లను తిరిగి ప్రారంభించారు. మొదట.. కాకినాడ వెళ్లే రైలు ఒకటో నంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయలు దేరింది. అటు.. మరోసారి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా స్టేషన్ ప్రాంగణంలో పోలీసులు, సీఆర్పీఎఫ్, ఆర్పీఎఫ్ బలగాలను భారీగా మోహరించారు. మళ్లీ అసాధారణ పరిస్థితులు తలెత్తకుండా పోలీసు అధికారులు భారీగా మోహరించారు. ఆందోళనకారులకు స్టేషన్ నుంచి బయటకి తరలించారు. దాదాపు 40 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.