
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం తాళ్ల మల్కాపురం గ్రామానికి చెందిన ఓ మహిళ గత కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతూ హుజూర్ నగర్ పట్టణంలోని సాయిబాబా ధియేటర్ ఎదురుగా ఉన్న విష్ణు జనరల్ ల్యాప్రోస్కోపిక్ ఆస్పత్రికి బుధవారం చికిత్స నిమితం చేరింది. ఆమెకు డాక్టర్ అనంతు విష్ణువర్ధన్ గౌడ్ గురువారం వైద్య పరీక్షలు నిర్వహించి.. స్కానింగ్ చేయగా అండాశయం వద్ద 7 కిలోల కణితి ఉన్నట్లుగా గుర్తించారు. ఈ క్రమంలో సదరు మహిళకు ఆస్పత్రిలో అరుదైన శస్త్ర చికిత్స చేసి అండాశయం వద్ద ఉన్న 7 కిలోల కణితిని తొలగించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య స్థితి బాగానే ఉన్నట్లుగా డాక్టర్ అనంతు విష్ణువర్ధన్ గౌడ్ తెలిపారు.
చాలాసార్లు ఈ కణితులు బయటకు ఎలాంటి లక్షణాలనూ చూపించవు అని డాక్టర్లు చెబుతున్నారు. అందుకే వాటిని గుర్తించడం కూడా క్లిష్టతరం.చాలా కేసుల్లో వేరే ఆరోగ్య సమస్య గురించి పరిశీలిస్తున్నప్పుడు ఈ కణితులు ఉన్న విషయం తెలుస్తూ ఉంటుంది. కణితులు ఇలా పెద్దగా ఉన్న కేసుల్లో మూత్రాశయంపై ఒత్తిడి పెరిగి… తరచూ మూత్రం వచ్చే సమస్య, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు కూడా రావొచ్చని వైద్యులు చెబుతున్నారు. 30 నుంచి 50 ఏళ్ల మధ్య వయసులో ఉన్నవారికి ఎక్కువగా ఈ గర్భాశయ కణితులు వస్తుంటాయి. మహిళల్లో గర్భాశయ కణితులు రావడం సాధారణమే. అందుకే, క్రమం తప్పకుండా టెస్టులు చేయించుకోవడం అవసరం. ముందుగా గుర్తిస్తే, రిస్క్ లేకుండా సులభంగా నయం చేయొచ్చు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి