AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రావణ దహనంలో అపశ్రుతి.. జనాలమీదకు దూసుకువచ్చిన టపాసులు.. తప్పిన పెను ప్రమాదం..

దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు సంబరంగా జరుగుతున్నాయి. విజయదశమి సందర్భంగా అమ్మవారి ఆలయాలకు భక్తులు పెద్దఎత్తున తరలి వచ్చారు.

రావణ దహనంలో అపశ్రుతి.. జనాలమీదకు దూసుకువచ్చిన టపాసులు.. తప్పిన పెను ప్రమాదం..
Ravan Dahan
Rajeev Rayala
|

Updated on: Oct 15, 2021 | 10:57 PM

Share

దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు సంబరంగా జరుగుతున్నాయి. విజయదశమి సందర్భంగా అమ్మవారి ఆలయాలకు భక్తులు పెద్దఎత్తున తరలి వచ్చారు. ఇక సాయంత్రం సమయంలో పలు చోట్ల రావణ దహనం నిర్వహించారు. అయితే ఈ రావణ దహనంలో అపశృతి చోటు చేసుకుంది. రావణుడి బొమ్మలో పెట్టిన టపాసులు పేలి జనాలమీదకు వచ్చేశాయి. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా దస్నాపూర్ లో జరిగింది. రావణ దహనం చేస్తుండగా ఒక్కసారిగా జనాల మీదకు టపాసులు దూసుకువచ్చాయి. దాంతో ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. ఈ ప్రమాదాంలో పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. తృటిలో తప్పిన పెను ప్రమాదం తప్పిందంటూ జనాలు ఊపిరిపీల్చుకున్నారు. ఒక్కసారి ఊహించని విధంగా టపాసులు దూసుకురావడంతో జనాలు భయబ్రాంతులకు గురయ్యారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Devaragattu Fight: దేవరగట్టు కర్రల సమరం మొదలైంది.. ఏ క్షణాన ఏమి జరుగుతుందోనని సర్వత్రా ఉత్కంఠ

Sai Dharam Tej: మా ఇంట్లో రెండు పండగలంటున్న మెగా ఫ్యామిలీ.. బ్యాచ్‌లర్‌గా లాస్ట్ బర్త్ డే అంటూ.. సాయి ధరమ్‌కు విశేష్ చెప్పిన మెగా కజిన్స్..

IPL 2021 Final, CSK vs KKR: ఫైనల్లో చెలరేగిన చెన్నై బ్యాట్స్‌మెన్స్.. కోల్‌కతా ముందు 193 పరుగుల భారీ స్కోర్