
రంజాన్ అనగానే వెంటనే గుర్తొచ్చేది హలీం. ఈ హలీమ్ తింటానికి సుదూర ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వారు కూడా ఎంతో మంది ఉన్నారు. హైదరాబాద్ హలీమ్ అంటే అంత ఫేమస్ మరి. అయితే శనివారం నెలవంక కనిపించడంతో నగరంలో ఆదివారం నుంచి పవిత్ర రంజాన్ మాస ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి అని తెలియజేస్తూ.. మసీదులలో సైరెన్ కూడా మోగించారు. ఇక సైరెన్ మోగడంతో పాతబస్తీలో సందడి వాతావరణం నెలకొంది. మసీదులను విద్యుత్ కాంతులతో ముస్తాబు చేశారు. ఉపవాస దీక్షల తో డ్రై ఫ్రూట్స్, పండ్లు ధరలు అమాంతం పెరిగాయి. ఇక రంజాన్ అంటేనే హలీం కదా దీంతో నగరంలో ప్రతి గల్లీలో హలీం దుకాణాలు వెలిశాయి.
ఉపవాస దీక్షల ముగిసిన తర్వాత హలీం షాపుల వద్ద హలీం ప్రియులు క్యూ కడుతున్నారు. అయితే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ భయం ఉండటంతో చాలా మంది మటన్ హలీమ్ వైపు మొగ్గు చూపుతున్నారు నాన్ వెజ్ ప్రియులు. దీంతో హలీంకు భారీ డిమాండ్ పెరిగిందని హలీమ్ వ్యాపారులు చెబుతున్నారు. రంజాన్ సమయంలో హలీం 200 రూపాయల నుంచి 250 రూపాయల వరకు పిస్తా హౌస్ లాంటి వాటిలో అమ్ముతూ ఉంటారు. కానీ ఇప్పుడు బర్డ్ ఫ్లూ కారణంగా 300 రూపాయలకు అమ్ముతున్నట్లు చెప్తున్నారు అమ్మకదారులు. ఎంతో పోషక విలువలు కలిగినటువంటి హలీం ను తినడానికి ధర ఎంతైనా సరే వెనకాడడం లేదు హలీమ్ ప్రియులు. మరోవైపు బర్డ్ ఫ్లూ కారణంగా హలీం డిమాండ్ పెరిగి కదా అని నాణ్యత తగ్గించి అమ్మే ప్రసక్తే లేదని తెలుపుతున్నారు వ్యాపారులు. మరి మీరు కూడా హలీమ్ను టెస్ట్ చేయలనుకుంటే వెంటనే చేసేయండి. లేదంటే మరింత ధర పెరిగే అవకాశం కూడా ఉంది.
Well-known #haleem eateries in Hyderabad’s Old City; please share your thoughts on which one stands out as the best.#Ramadan #haleem #Hyderabad pic.twitter.com/8CNsyOUJf6
— Nawab Abrar (@nawababrar131) March 2, 2025
Grew up relishing this dish. Now, I have become the voice of it 😊
Voiced this for Pista House. ✨
It’s Haleem season, Hyderabad! 🥰
Ramadan Mubarak!
Ramzan Mubarak! pic.twitter.com/9VSGo6Ph4B— Anuj Gurwara (@AnujGurwara) February 28, 2025