AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: “నేనే మంత్రాలతో చంపా.. పూజలతో మళ్లీ బ్రతికిస్తా”.. జగిత్యాలలో కలకలం

నింగిలో అద్భుతాలు చేసే స్థాయికి వెళ్లాం. కానీ కొందరి మెదళ్లలోనుంచి మూఢనమ్మకాలను మాత్రం...

Telangana: నేనే మంత్రాలతో చంపా.. పూజలతో మళ్లీ బ్రతికిస్తా.. జగిత్యాలలో కలకలం
Dead Body Worship
Ram Naramaneni
| Edited By: |

Updated on: Aug 14, 2021 | 7:59 PM

Share

నింగిలో అద్భుతాలు చేసే స్థాయికి వెళ్లాం. కానీ కొందరి మెదళ్లలోనుంచి మూఢనమ్మకాలను మాత్రం తొలగించలేకపోతున్నాం. తాజాగా  చనిపోయిన వ్యక్తిని  బతికిస్తానంటూ శవం దగ్గర పూజలు చేసిన ఘటన జగిత్యాల టీఆర్‌ నగర్‌లో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల రూరల్‌ మండలం  టీఆర్‌ నగర్‌లో ఓర్సు రమేష్‌ అనే వ్యక్తి చనిపోయాడు. మంత్రాల కారణంగానే రమేష్ మృతి చెందాడని.. పుల్లయ్య అనే వ్యక్తిని బాధిత కుటుంబ సభ్యులు, సన్నిహితులు చితక బాదారు. దెబ్బలకు తాళలేక.. తానే మంత్రాలతో రమేష్‌ని చంపానని, మంత్రాలతో మళ్లీ అతడికి పునర్జీవం తెస్తానంటూ ఉదయం నుంచి శవం దగ్గర పుల్లయ్య పూజలు చేయడం ప్రారంభించాడు. ఈ విషయం ఆ నోట ఈ నోట పోలీసులకు చేరింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పుల్లయ్యను అదుపులోకి తీసుకున్నారు. రమేశ్‌ డెడ్‌బాడీని జగిత్యాల ఆసుపత్రికి తరలించారు.  పుల్లయ్యను పోలీసులు తీసుకెళ్లటంతో మృతుని బంధువుల ధర్నాకు దిగారు. దీంతో కరీంనగర్ – జగిత్యాల రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. 

 రెండేళ్ల కూతురును చంపి.. తల్లి ఆత్మహత్యాయత్నం

ఏపీలోని అనంతపురం జిల్లా ధర్మవరంలోని కొత్తపేటలో దారుణం చోటుచేసుకుంది. రెండున్నరేళ్ల చిన్నారిని కన్న తల్లే దారుణంగా హత్య చేసింది. కొత్తపేట కాలనీలో మీనాక్షి, శ్రీనివాసులు దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. శ్రీనివాసులు చేనేత పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దంపతుల మధ్య గత కొంతకాలంగా చిన్నపాటి గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం శ్రీనివాసులు తన పెద్ద కుమార్తె తనుశ్రీని తీసుకుని బయటకు వెళ్లాడు. అదే సమయంలో మీనాక్షి.. తన చిన్న కుమార్తె ప్రణతి(2)ని కత్తితో పొడిచి చంపేసింది. ఆ తర్వాత తానూ ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన స్థానికులు వెంటనే భర్త శ్రీనివాసులుకు సమాచారం అందించారు. ఇంటికి చేరుకున్న శ్రీనివాసులు… మీనాక్షిని అనంతపురం గవర్నమెంట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. భార్యాభర్తల మధ్య నెలకొన్న విభేదాలతోనే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:నాగుల పంచమి వేళ పాముకు హ్యపీ బర్త్ డే.. నెట్టింట రచ్చ చేస్తోన్న వీడియో

జంతువుల వెంట్రుకల్ని దొంగిలించే పక్షులు.. పెద్ద రీజనే ఉందడోయ్

సంకల్ప బలం ముందు తలవంచిన వైకల్యం.. మరుగుజ్జు ఐఏఎస్ ఆఫీసర్ ఆర్తి డోగ్రా విజయ గాథ

హిజ్రాపై మోజుపడ్డ యువకుడు.. మాట ముచ్చటతో దగ్గరయ్యారు.. తనను దూరం చేయడం తట్టులేక..

కుంభ రాశిలోకి కుజుడు.. లక్కూ, హ్యాపీనెస్.. ఈ రాశుల పంట పండినట్లే
కుంభ రాశిలోకి కుజుడు.. లక్కూ, హ్యాపీనెస్.. ఈ రాశుల పంట పండినట్లే
ఫ్రీగా గ్యాస్ సిలిండర్, స్టౌవ్.. మహిళలకు కేంద్రం అదిరిపోయే..
ఫ్రీగా గ్యాస్ సిలిండర్, స్టౌవ్.. మహిళలకు కేంద్రం అదిరిపోయే..
కోపం ఎక్కువగా వస్తోందా? ఇవి తింటే వెంటనే రిలాక్స్ ఐపోతారు..
కోపం ఎక్కువగా వస్తోందా? ఇవి తింటే వెంటనే రిలాక్స్ ఐపోతారు..
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. విశాఖ మెట్రోకు గ్రీన్‌సిగ్నిల్!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. విశాఖ మెట్రోకు గ్రీన్‌సిగ్నిల్!
రొమాంటిక్ సీన్లతో రెచ్చిపోయింది.. కట్ చేస్తే.. సినిమాలకు దూరం..
రొమాంటిక్ సీన్లతో రెచ్చిపోయింది.. కట్ చేస్తే.. సినిమాలకు దూరం..
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
టీ20 ప్రపంచకప్ హిస్టరీలో హ్యాట్రిక్ వీరులు.. టాప్ 5 లిస్ట్ ఇదే..
టీ20 ప్రపంచకప్ హిస్టరీలో హ్యాట్రిక్ వీరులు.. టాప్ 5 లిస్ట్ ఇదే..
తోటకూర చికెన్ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలకుండా తింటారు!
తోటకూర చికెన్ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలకుండా తింటారు!
ఈసీ కీలక నిర్ణయం.. రాష్ట్రంలోని ఆ వార్డుకు ఎన్నిక రద్దు!
ఈసీ కీలక నిర్ణయం.. రాష్ట్రంలోని ఆ వార్డుకు ఎన్నిక రద్దు!
లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాపై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం!
లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాపై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం!