MP Dharmapuri Arvind: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై బంజరాహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు.. ఎందుకంటే..!

MP Dharmapuri Arvind: నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు ధర్మపురి అరవింద్‌పై బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై..

MP Dharmapuri Arvind: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై  బంజరాహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు.. ఎందుకంటే..!

Updated on: Jan 03, 2022 | 2:00 PM

MP Dharmapuri Arvind: నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు ధర్మపురి అరవింద్‌పై బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అరవింద్‌పై ఐపీసీ 504,55 (2), 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, నవంబర్‌ 8న మీడియా సమావేశంలో ముఖ్యమంత్రిపై ఎంపీ అరవింద్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారని బోయిన్‌పల్లికి చెందిన వ్యాపారి కల్యాణ్‌ సందీప్‌ బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు అయ్యింది.

తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోకు నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కరీంనగర్‌లోని తన ఎంపీ క్యాంప్‌ కార్యాలయంలో చేపట్టిన దీక్షను ఆదివారం పోలీసులు భగ్నం చేశారు. అనంతరం ఆయనను మానకొండూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలోనే కరీంనగర్‌ పోలీసులు బండి సంజయ్‌పై కూడా రెండు కేసులు నమోదు చేశారు. కరోనా నిబంధనలు పాటించనందున, అలాగే పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని సంజయ్‌ పై కేసులు నమోదు చేశారు. ఇలా రాష్ట్రంలో బీజేపీ నేతల దీక్షలు, వ్యాఖ్యలతో రాజకీయ రగడ మొదలైంది.

ఇవి కూడా చదవండి:

తెలంగాణ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కోవిడ్‌ బెడ్స్‌ ఎన్ని అందుబాటులో ఉన్నాయి..? పూర్తి వివరాలు

Numaish: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈనెల 10 వరకు నుమాయిష్‌ ప్రవేశం నిలిపివేత..!