AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: కామారెడ్డి ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా

ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.

PM Modi: కామారెడ్డి ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా
Pm Modi Accident
Sanjay Kasula
|

Updated on: May 09, 2022 | 2:24 PM

Share

కామారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధితుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ కింద తక్షణ సాయంగా రూ. 2 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. గాయపడిన వారికి చికిత్స కోసం రూ. 50 వేలు ప్రకటించారు.

చిల్లర్గి ఘొల్లుమంది. అంబులెన్స్‌ నుంచి మృతదేహాలు దిగుతుంటే ఊరు ఊరంతా బోరున విలపించింది. త్వరగా వచ్చేస్తామంటూ వెళ్లినవాళ్లు విగతజీవులుగా తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. మొన్నటి వరకు తమతో కలిసి పనిపాటలకు వచ్చినవాళ్లు ఇక లేరంటే గ్రామస్తులు నమ్మలేకపోతున్నారు. ఒక రోడ్డు ప్రమాదం చిన్న ఊరు చిల్లర్గిలో పెను విషాదాన్ని నింపేసింది.

కామారెడ్డి జిల్లాలో నిన్న సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయినవారి మృతదేహాలను ఇవాళ గ్రామానికి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో తొమ్మంది మంది చనిపోయారు. మరో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పిట్లం మండలం చిల్లర్గి గ్రామస్తులు టాటా ఏస్‌ వాహనంలో దినకర్మకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదం సమయంలో ఆటోలో.. పిల్లలు, మహిళలు సహా 22 మంది ప్రయాణిస్తున్నారు. ఎల్లారెడ్డి మండలం హాసంపల్లి వద్ద ధాన్యం లోడుతో వెళ్తున్న లారీ బలంగా ఢీకొట్టడంతో ప్రయాణికులంతా ఎగిరి పడ్డారు.

ప్రమాదం జరిగిన ప్రాంతమంతా రక్తసిక్తమైంది. తీవ్ర గాయాలతో ఆర్తనాదాలు చేశారు బాధితులు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు 8 మంది మృతి స్పాట్‌లో చెందారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు చనిపోయారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. మరో 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు చెప్తున్నాయి. ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.

జియోలో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ..
జియోలో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ..
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
కుప్పకూలిన "సునామీ స్వింగ్", ఒకరు మృతి, 13మందికి సీరియస్!
కుప్పకూలిన
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
మీ కాలేయంలోని కొవ్వును వెన్నలా కరిగించే పానియం ఇది.. తయారీ ఇలా..
మీ కాలేయంలోని కొవ్వును వెన్నలా కరిగించే పానియం ఇది.. తయారీ ఇలా..
ప్రేమలో ఉన్న ప్రతి కుర్రాడు పాడుకునే ఏకైక సాంగ్..
ప్రేమలో ఉన్న ప్రతి కుర్రాడు పాడుకునే ఏకైక సాంగ్..
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162
ఇదేం పిచ్చిరా బాబా.. రీల్‌ రీక్రియేట్ చేస్తుండగా జారీన ఛైర్..
ఇదేం పిచ్చిరా బాబా.. రీల్‌ రీక్రియేట్ చేస్తుండగా జారీన ఛైర్..
రోజూ ఓ గ్లాస్‌ రెడ్‌ వైన్‌ తాగితే గుండె ఆరోగ్యానికి మంచిదా?
రోజూ ఓ గ్లాస్‌ రెడ్‌ వైన్‌ తాగితే గుండె ఆరోగ్యానికి మంచిదా?