AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: వర్క్ ఫ్రమ్ బైక్.. పని కడుపు నింపుకోవడానికి.. కడతేర్చుకునేందుకు కాదు..!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోపై హైదరాబాద్ పోలీస్ కమీషనర్ వీసీ సజ్జనార్ తీవ్రంగా స్పందించారు. రద్దీ రహదారిపై బైక్ నడుపుతూనే ల్యాప్‌టాప్‌లో పని చేస్తున్న ఓ యువకుడి వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రయాణం చేస్తూనే ల్యాప్‌టాప్‌ను బైక్ ముందు భాగంలో ఉంచుకుని పని చేస్తున్న ఈ యువకుడి నిర్లక్ష్య వైఖరిపై సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు.

Hyderabad: వర్క్ ఫ్రమ్ బైక్.. పని కడుపు నింపుకోవడానికి.. కడతేర్చుకునేందుకు కాదు..!
Laptop While Riding Bike
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Jun 13, 2026 | 11:35 AM

Share

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోపై హైదరాబాద్ పోలీస్ కమీషనర్ వీసీ సజ్జనార్ తీవ్రంగా స్పందించారు. రద్దీ రహదారిపై బైక్ నడుపుతూనే ల్యాప్‌టాప్‌లో పని చేస్తున్న ఓ యువకుడి వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రయాణం చేస్తూనే ల్యాప్‌టాప్‌ను బైక్ ముందు భాగంలో ఉంచుకుని పని చేస్తున్న ఈ యువకుడి నిర్లక్ష్య వైఖరిపై సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు.

వైరల్ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన సజ్జనార్, “ప్రతి పనికీ ఒక పద్ధతి ఉంటుంది. కానీ ప్రాణాలను పణంగా పెట్టి ఇలా వర్క్ ఫ్రమ్ బైక్ చేయడం ఏమాత్రం సమంజసం కాదు” అని వ్యాఖ్యానించారు. ఉద్యోగ ఒత్తిడి, పనిభారం, సమయాభావం పేరుతో ఇలాంటి ప్రమాదకర చర్యలకు పాల్పడటం వల్ల తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.

రోడ్డు మీద ప్రయాణించే సమయంలో క్షణకాలం ఏకాగ్రత కోల్పోయినా ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సజ్జనార్ గుర్తు చేశారు. “రోడ్డుపై మీ దృష్టి ఒక్క క్షణం మరలినా అది మీ ప్రాణానికే కాదు, ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదకరం” అని పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ప్రతి వాహనదారుడి బాధ్యత అని, నిర్లక్ష్యపు ప్రవర్తన వల్ల అనేక కుటుంబాలు విషాదంలో మునిగిపోతున్నాయని తెలిపారు.

“కడుపు నింపుకోవడానికి చేసే పని.. కడతేర్చేలా ఉండకూడదు” అంటూ సజ్జనార్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి. ఈ ఘటనపై నెటిజన్లు కూడా తీవ్రంగా స్పందిస్తూ, ఇలాంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రహదారి భద్రత అందరి బాధ్యత అని, ప్రయాణ సమయంలో పూర్తిగా డ్రైవింగ్‌పైనే దృష్టి సారించాలని సజ్జనార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us