ప్రముఖ ఉర్దు రచయిత ముజ్తాబా హుస్సేన్ పరమపదించారు.హైదరాబాద్లోని ఆయన నివాసంలో బుధవారం ఉదయం 8.45 నిమిషాలకు గుండెపోటుతో ప్రాణాలు విడిచినట్లు ఆయన కుమారుడు హాడీ హుస్సేన్ తెలిపారు. ఆయన ఉర్దు పత్రికలకు ఎన్నో కథనాలు రాయడమే కాకుండా.. పలు పుస్తకాలు కూడా రాశారు. అయనకు 2007లో పద్మ శ్రీ అవార్డు కూడా అందుకున్నారు. అయితే 2019లో దేశంలో చోటుచేసుకున్న పరిణామాల పట్ల.. ఆందోళణ చెందిన ఆయన.. తనకు వచ్చిన పద్మ శ్రీ అవార్డును తిరిగి ఇచ్చేందుకు ప్రయత్నించారు.