AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పంది మాసం కోసం భార్య ప్రాణం తీసిన భర్త.. అసలు ఏం జరిగిందంటే?

కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం, సర్దుకపోవడం సర్వసాధారణం. కానీ ఇక్కడ ఇష్టమైన ఆహారం కోసం భార్యభర్తల మధ్య మొదలైన గొడవ.. చివరికి ఒకరి ప్రాణాల మీదకు తెచ్చింది. చిన్న విషయంగా మొదలైన గొడవ క్షణాల్లో వివాదంగా మారింది.. ఇరుగుపొరుగు వారు సర్దిచెప్పినా.. భర్త మాత్రం ఆ గొడవను పక్కన పెట్టలేదు.. దాన్ని అలానే మనసులో పెట్టుకున్నాడు. అందరూ వెళ్లిపోయాక రాత్రివేళ ఇంట్లో నిద్రిస్తున్న భార్యపై దాడి చేసి హతమార్చాడు. ఒక్క గొడవతో 66 ఏళ్ల జీవితం ముగిసింది. ఇంతకీ కట్టుకున్న భార్యను ఎందుకు హత్య చేశాడు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Telangana: పంది మాసం కోసం భార్య ప్రాణం తీసిన భర్త.. అసలు ఏం జరిగిందంటే?
Husband Kills Wife Over Pork Meat Refusal
M Revan Reddy
| Edited By: |

Updated on: Sep 07, 2026 | 8:23 AM

Share

ఇష్టమైన ఆహారం విషయంలో భార్యభర్తల మధ్య జరిగిన చిన్న వివాదం చివరకు ఒకరి ప్రాణాలు తీసే వరకు వెళ్లింది. వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లా కనగల్ మండలం షాబ్దుల్లాపురం గ్రామానికి చెందిన కారింగు లింగయ్య, లింగమ్మ దంపతులు కూలి నాలి చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉండగా.. వారికి వివాహాలు కావడంతో అత్తారింటికి వెళ్లిపోయారు. దీంతో ఇంట్లో భార్యాభర్తలిద్దరే ఉంటున్నారు. లింగమ్మ కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని నడిపించడంలో భర్తకు సహకరిస్తోంది.

అయితే లింగయ్యకు పంది మాంసం తినే అలవాటు ఉంది. దీంతో పంది మాంసం కోసం భార్య లింగమను డబ్బులు అడిగాడు.. కానీ శ్రావణ మాసం కావడంతో ఇంట్లోకి పంది కూర తీసుకురావడం ఇష్టం లేని లింగమ్మ భర్తకు డబ్బు ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఇంట్లో జరిగిన గొడవను గమనించిన ఇరుగు పొరుగు వారు ఇద్దరికీ నచ్చజెప్పడంతో అప్పటికి గొడవ సద్దుమణిగింది.

కానీ.. ఆ వివాదం లింగయ్య మనసులో మాత్రం అలాగే ఉండిపోయింది. ఆ కొద్ది పాటి కోపంలో 66 ఏళ్ల తమ వివాహ బందాన్ని మరిచిన లింగయ్య రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న లింగమ్మపై దాడికి దిగాడు. భర్త దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. విషయం తెలుసుకొని ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసినట్లు కనగల్ ఎస్సై రాజీవ్ రెడ్డి తెలిపారు. చిన్న కుటుంబ కలహాలు ఎంతటి విషాదానికి దారితీస్తాయో చెప్పే మరో ఘటనగా ఇది నిలిచింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us