Medaram Jathara: మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర తేదీలు ఖరారు.. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి

Sammakka Saralamma Jatara: ఆసియా ఖండంలో జరిగే అతిపెద్ద ఆదివాసం మహాసమ్మేళనంగా ప్రసిద్ది చెందిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర తేదీలు ఖరారు అయ్యాయి....

Medaram Jathara: మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర తేదీలు ఖరారు.. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి
Medaram Jathara

Updated on: Apr 25, 2021 | 6:20 PM

Sammakka Saralamma Jatara: ఆసియా ఖండంలో జరిగే అతిపెద్ద ఆదివాసం మహాసమ్మేళనంగా ప్రసిద్ది చెందిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర తేదీలు ఖరారు అయ్యాయి. మాఘమాసంలో నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా మహాజాతరను నిర్వహించనున్నారు.2022లో జరగనున్న మేడారం మహాజాతర తేదీనలు ఆలయ పూజరులు ప్రకటించారు. 2022 ఫిబ్రవరి 16 నుంచి 19 తేదీ వరకు ఈ జాతర నిర్వహించనున్నారు. సమ్మక్క-సారలమ్మల మహా జాతరను ఆదివాసీ గిరిజన సాంప్రదాయ ప్రకారం మాఘ శుద్ధ పౌర్ణమి రోజున నిర్వహిస్తారు.

2022లో జరిగే జాతర తేదీలు ఇవే..

► ఫిబ్రవరి 16 – సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులును గద్దెల వద్దకు తీసుకొస్తారు.
► ఫిబ్రవరి 17 – చిలకలగుట్ట నుంచి సమ్మక్క దేవతను గద్దెల వద్దకు చేరుస్తారు.
► ఫిబ్రవరి 18 – సమ్మక్క-సారక్క అమ్మవార్లకు ప్రజలు మొక్కులు సమర్పించుకోవడం.
► ఫిబ్రవరి 19 – వన ప్రవేశం, మహా జాతర ముగింపు.

కాగా, మరో వైపు తెలంగాణలో కరోనా వ్యాప్తి దృష్ట్యా మేడారం పూజారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది మే 1 నుంచి 15వ తేదీ వరకు మేడారం అమ్మవార్ల దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ పూజారులు తెలిపారు.

కాగా, భారతదేశంలో కుంభమేళా తర్వాత అత్యధికంగా భక్తులు హాజరయ్యే జాతర ఇదే. జాతర ముగిసే వరకు వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 2 కోట్లకుపైగా భక్తులు హాజరుతారని అంచనా. కాగా, ములుగు జిల్లా కేంద్రం నుండి 44 కిలోమీటర్ల దూరంలోని తాడ్వాయి మండలం మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవుల్లో ఈ చారిత్రాత్మకమైన ఈ జాతర జరుగుతుంది. అయితే ఈ పండగను 2014లో రాష్ట్ర పండగుగా ప్రభుత్వం గుర్తించింది. ఈ మహా జాతరకు తెలంగాణ జిల్లాల నుంచి కాకుండా ఒడిశా, ఏపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు తరలివస్తుంటారు.

ఇవీ చదవండి:

తెలంగాణలో కరోనాపై హైకోర్టులో విచారణ.. కేసులు తగ్గాయన్న ప్రభుత్వం.. ఎక్కడ తగ్గాయో చూపించాలని హైకోర్టు ప్రశ్న

పరిశ్రమలపై మళ్లీ కరోనా పిడుగు.. ప్లాస్టిక్‌, సిమెంట్‌, స్టీల్‌ ధరలకు రెక్కలు..కోవిడ్‌తో ముడిసరుకుపై తీవ్ర ప్రభావం

Loading...
Unable to load recommendations.
Follow Us