Telangana: ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు..

|

Apr 20, 2024 | 9:30 AM

తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదం భగ్గుమంది. నాగార్జున సాగర్ టెయిల్ పాండ్‌లో నీటి నిల్వలు ఖాళీగా ఉండటం తీవ్ర కలకలం రేపింది. కృష్ణా జలాలు రగడ ఫీక్స్ చేరింది. ఏపీ, తెలంగాణ మధ్య మరోసారి కృష్ణా జలాల వివాదం చెలరేగింది. నాగార్జునసాగర్‌ టెయిల్‌ పాండ్‌లో నీటి నిల్వలు పూర్తిగా ఖాళీ అయ్యాయి. నీటి నిల్వలను ఏపీ పూర్తిగా వినియోగించుకోవడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు తాగునీటికి కూడా ఇబ్బందులు పడుతున్నారు.

Telangana: ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు..
Krishna River
Follow us on

తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదం భగ్గుమంది. నాగార్జున సాగర్ టెయిల్ పాండ్‌లో నీటి నిల్వలు ఖాళీగా ఉండటం తీవ్ర కలకలం రేపింది. కృష్ణా జలాలు రగడ ఫీక్స్ చేరింది. ఏపీ, తెలంగాణ మధ్య మరోసారి కృష్ణా జలాల వివాదం చెలరేగింది. నాగార్జునసాగర్‌ టెయిల్‌ పాండ్‌లో నీటి నిల్వలు పూర్తిగా ఖాళీ అయ్యాయి. నీటి నిల్వలను ఏపీ పూర్తిగా వినియోగించుకోవడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు తాగునీటికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. రెండ్రోజుల క్రితం అడవిదేవులపల్లి దగ్గర టెయిల్‌ పాండ్‌ను సందర్శించారు నీటి పారుదల శాఖ కమిషనర్‌ సుల్తానియా. టెయిల్ పాండ్‎లోని నీటిని ఏపీ గుట్టు చప్పుడు కాకుండా తరలించినట్లు వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు.

ఏపీ నీటి చౌర్యాన్ని ప్రభుత్వానికి తెలిపారు ఇరిగేషన్ అధికారులు. దీంతో ఆ నివేదిక ఆధారంగా ఏపీ తీరుపై కేఆర్‌ఎంబీకి లేఖరాసేందుకు సిద్ధమైంది తెలంగాణ సర్కార్. కొద్ది రోజులుగా టెయిల్ పాండ్ కుడివైపు నుంచి మొత్తం నీటిని ఖాళీ చేస్తుంది ఏపీ ప్రభుత్వం. మరోవైపు అత్యవసర సమయంలో టెయిల్ పాండ్ బ్యాక్ వాటర్ నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా తెలంగాణ జెన్కో విద్యుత్తు ఉత్పత్తి చేస్తుంది. దీనిపై మాజీ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. టేల్‌పాండ్ నీళ్లు చోరీకి గురికావడానికి ప్రధాన బాధ్యలు నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు, సీఎం రేవంత్‌రెడ్డి అని ఆరోపించారు జగదీశ్వర్‌రెడ్డి.

పూర్తి వీడియో..

 

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..