Telangana: మా కాపురంలో చిచ్చు పెడుతున్నారు.. ఎమ్మెల్యే రాజయ్యపై మళ్లీ సంచలన ఆరోపణలు చేసిన సర్పంచ్ నవ్య

|

Jun 21, 2023 | 10:17 AM

ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య - జానకీపురం సర్పంచ్ నవ్య మధ్య వివాదం మళ్లీ మొదటికొచ్చింది. గతంలో లైంగిక ఆరోపణలు.. ఆ తర్వాత కాంప్రమైజ్‌లు వెంట వెంటనే జరిగిపోయాయి. కానీ ఇప్పుడవి మళ్లీ భగ్గుమన్నాయి

Telangana: మా కాపురంలో చిచ్చు పెడుతున్నారు.. ఎమ్మెల్యే రాజయ్యపై మళ్లీ సంచలన ఆరోపణలు చేసిన సర్పంచ్ నవ్య
Mla Rajaiah
Follow us on

ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య – జానకీపురం సర్పంచ్ నవ్య మధ్య వివాదం మళ్లీ మొదటికొచ్చింది. గతంలో లైంగిక ఆరోపణలు.. ఆ తర్వాత కాంప్రమైజ్‌లు వెంట వెంటనే జరిగిపోయాయి. కానీ ఇప్పుడవి మళ్లీ భగ్గుమన్నాయి. ఏకంగా కాపురంలో చిచ్చు దాకా వెళ్లాయి. గతంలో లైంగిక ఆరోపణలకు సంబంధించి ఆధారాలివ్వాలని ఎమ్మెల్యే రాజయ్య ఒత్తిడి చేయడంతో మ్యాటర్‌ చిరిగి చాటైంది. కొద్ది రోజుల క్రితం స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై మహిళా సర్పంచ్‌ నవ్య లైంగిక ఆరోపణలు పెద్ద దుమారాన్నే లేపాయి. నవ్య ఆరోపణలను సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ వేధింపుల ఆరోపణలపై విచారణకు ఆదేశించింది. బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ఆదేశాలతో.. నవ్య ఇంటికి వెళ్లిన రాజయ్య సర్ధిచెప్పారు. జరిగిన పరిణామాలకు చింతిస్తున్నానని విచారణ వ్యక్తం చేశారు.

లైంగిక ఆరోపణల ఎపిసోడ్‌కి ఎండ్‌కార్డ్‌ పడిందనేలోగా మళ్లీ నవ్య తెరపైకి వచ్చారు. ఆడియోలు టేపులు కావాలి.. అందుకోసం 20లక్షలు ఇస్తానని ఎమ్మెల్యే బేరాలు ఆడుతున్నారని బాంబు పేల్చారు. గ్రామానికి నిధుల పేరుతో డబ్బులిస్తూనే అప్పుకింద బాండ్ పేపర్‌పై సంతకం చేయాలంటున్నారని.. ఈ లాజిక్‌ ఏంటో తనకు అర్థం కావడం లేదన్నారు నవ్య. ఎమ్మెల్యే ఒత్తిడితో తన భర్త కాంప్రమైజ్ కావాలంటున్నారని.. కానీ ఈ విషయంలో ఎక్కడికైనా ఎందాకైనా వెళ్తానన్నారు. అయిపోయిందనుకున్న వివాదాన్ని మళ్లీ ఎందుకు తట్టిలేపారు? ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. మరోవైపు రాజయ్యపై నవ్య ఫిర్యాదు చేస్తే పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదన్నది మరో ప్రశ్నగా కనిపిస్తోంది. నవ్య మాత్రం అధిష్టానానికి ఫిర్యాదు చేస్తూనే తన పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేస్తున్నారు. ఇక ఈ విషయంలో రాజయ్య ఎలా స్పందిస్తారన్నది చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి..