AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వక్ఫ్‌ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన బాటపట్టిన కాంగ్రెస్, ఎంఐఎం..!

భారతదేశంలో కొత్త వక్ఫ్ చట్టం విస్తృత నిరసనలకు దారితీసింది. తెలంగాణతో సహా దేశంలోని అనేక ప్రాంతాలలో ఆందోళనలు జరుగుతున్నాయి. కాంగ్రెస్, AIMIM పార్టీలు ఈ చట్టాన్ని సుప్రీం కోర్టులో సవాలు చేశాయి. అమిత్ షా ఈ చట్టం ముస్లింలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.

వక్ఫ్‌ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన బాటపట్టిన కాంగ్రెస్, ఎంఐఎం..!
Waqf
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Apr 13, 2025 | 7:58 AM

Share

వక్ఫ్‌ కొత్త చట్టం దేశమంతటా కలకలం సృష్టిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో సైతం వక్ఫ్‌ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు మొదలయ్యాయి. కాంగ్రెస్‌ ముస్లిం నేతలు ఈ ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఆల్‌ ఇండియా ముస్లిం లాబోర్డు సమావేశం నిర్వహించనున్నట్టు సమాచారం. అయితే.. దేశంలోని కొన్ని విపక్షాలు వ్యతిరేకిస్తున్న ఈ బిల్లుపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో ఈ బిల్లు ఆవశ్యకతపై స్పష్టమైన వైఖరిని తెలియజేశారు.

ఈ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని అమిత్ షా చెప్పుకొచ్చారు. వక్ఫ్ బోర్డు పేరుతో దేశంలో భారీ దోపిడీ జరుగుతోందని, ఈ దోపిడీని అరికట్టేందుకే సవరణలు చేస్తున్నట్లు తెలిపారు. పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదం పొందిన వక్ఫ్ బిల్లు-2025పై కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు సుప్రీంకోర్టులో సవాలు చేశాయి. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావేద్, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ బిల్లు రాజ్యాంగ చెల్లుబాటు అంశాన్ని సైతం ఒవైసీ సుప్రీంలో సవాల్ చేశారు. బిల్లులో అంశాలు ముస్లింల సమాజ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఉన్నాయని ఓవైసీ తనదైన శైలిలో మండిపడ్డారు.

హైదరాబాద్-పాతబస్తీ మక్కా మసీదు ప్రాంతంలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కొంతమంది యువకుల నిరసన చేపట్టారు. వక్ఫ్ బిల్లును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల నడుమ ఈ నెల 19న హైదరాబాద్‌లో ఎంఐఎం బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ నెల 23న చలో హైదరాబాద్‌కు ముస్లిం మతపెద్దల పిలుపునిచ్చారు. వక్ఫ్ సవరణ బిల్లు రద్దు చేసే వరకూ తమ పోరాటం ఆగదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో వక్ఫ్ సవరణ బిల్లుపై తర్వాతి పరిణామాలు ఎలాంటి మరిన్ని మలుపులు తీసుకుంటాయో వేచి చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ కౌబాయ్‌ను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో..
ఈ కౌబాయ్‌ను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో..
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?