వరంగల్ నిట్ మరో అడుగుముందుకు వేసింది. ఢిల్లీ ఐఐటీ విద్యా సంస్ధతో ఎంవోయూ కుదుర్చుకుంది. ఒప్పందానికి సంబంధించిన వివరాలను నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు తెలిపారు. ఐఐటీ ఢిల్లీ ప్రతినిధులతో జరిగిన ఆన్లైన్ సమావేశంలో ఈ ఒప్పందం చేసుకున్నట్లు వివరించారు. లాక్డౌన్కు ముందు ఈ ఒప్పందంపై చర్చలు జరిగాయన్నారు. విద్య, పరిశోధనాంశాల్లో సహాయ సహకారాల కోసం ఈ ఎంవోయూ కుదుర్చుకున్నట్లు తెలిపారు. విద్య, పరిశోధనలపై సంయుక్త పరిశోధన, పీహెచ్డీ పరిశోధనలకు సహకారం, నిట్లో చదివి 8 సీజీపీఏ సాధించిన విద్యార్థికి నేరుగా ఐఐటీ ఢిల్లీలో ప్రవేశం వంటి ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వివరించారు. ఈ ఎంఓయూతో విద్యార్థులకు చక్కటి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు రమణారావు.