AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఓరీ దేవుడో ఏసీ పేలుడుతో ఇద్దరికీ తీవ్ర గాయాలు.. ఏం జరిగిందంటే..

ఇప్పుడు నడుస్తున్నది ఎండాకాలం.. ఈ మండుటెండల్లో కాసేపు కరెంట్ పోతే ఉక్కపోతకు ఉక్కిరిబిక్కరి అయిపోతుంటాం. అందుకే ఈ సీజన్‌లో ఖచ్చితంగా రోజంతా ఇంట్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు నడవాల్సిందే.. లేకపోతే క్షణమైనా ఉండలేని పరిస్థితికి వచ్చేశాం. అయితే.. వేసవిలో చల్లదనాన్ని ఇచ్చే ఆ ఏసీనే ఇప్పుడు కొంప ముంచింది. రిపేర్ ఉందని ఏసీని బాగుచేస్తుండగా ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయయ్యాయి. ఏసీ ఏంటి.. అంతలా గాయాలపాలు కావడం ఏంటి అనుకుంటున్నారా? పూర్తి వివరాలు చూద్దాం రండి.

Telangana: ఓరీ దేవుడో ఏసీ పేలుడుతో ఇద్దరికీ తీవ్ర గాయాలు.. ఏం జరిగిందంటే..
Ac Exploded
Follow us
Noor Mohammed Shaik

| Edited By: Jyothi Gadda

Updated on: May 10, 2025 | 1:04 PM

హైదరాబాద్ నగరం పాతబస్తీ ఏరియా తలబ్ చంచలామ్ ప్రాంతంలో ఓ ఏసీ అకస్మాత్తుగా పేలింది. మరమ్మతులు చేద్దామని టెక్నీషియన్లు ఏసీని రిపేర్ చేస్తుండగా ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. దీంతో వెంటనే గాయపడిన ఇద్దరు యువకులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. నాణ్యత లేని ఏసీ పరికరాల విషయంలో ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని చెబుతున్నారు. ఏసీలకు ఎటువంటి సర్వీసింగ్‌ చేయకుండా, తిరిగి అదే వినియోగించుకుందామని అనుకుంటారు చాలా మంది. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ప్రమాదాలే జరుగుతుంటాయని, ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

సరైన నిర్వహణ, ఇతర ఎలక్ట్రికల్‌ లోపాల కారణంగా కూడా ఏసీ పరికరాలు పేలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. చాలా ఏళ్ల తరబడి పాత ఏసీలను అలాగే వినియోగించే ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా సర్వీసింగ్‌ చేయించాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలని సలహా ఇస్తున్నారు. సర్వీసింగ్‌ వల్ల ఏసీ మెరుగైన పనితీరును కనబరుస్తుంది.. విద్యుత్‌ను కూడా ఆదా చేస్తుంది. దాంతో పాటే ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉండదని నిపుణులు జాగ్రత్తలు చెబుతున్నారు.

కాగా, ఏసీ ప్రమాద విషయం తెలుసుకున్న యాకుత్‌పురా ఎమ్మెల్యే జాఫర్ హుసైన్ మెరాజ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిపై ఆరా తీశారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు. ప్రజలు ఈ వేసవి సీజన్‌లో ఇలాంటి విషయాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. పాత కాలం ఏసీలను వాడుతున్నట్లయితే ఎప్పటికప్పుడు అవసరమైన విధంగా సర్వీసింగ్ చేయించాలని, లేకపోతే ఇలాంటి ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరించారు. తలబ్ చంచలామ్ ప్రాంతంలో ఏసీ ప్రమాద ఘటనలో గాయాలపాలైన ఇద్దరు యువకులకు సరైన చికిత్స అందించాలని ఆసుపత్రి సిబ్బందిని కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..